Security Alert: సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం! జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్!

2026-01-12 08:52:00
Celebrity Couple: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ప్రేమకథకు క్లైమాక్స్.. కైలీ జెన్నర్‌ను ఉద్దేశించి హాలీవుడ్ హీరో సంచలన మాటలు!!!

జమ్మూ–కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (IB), నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఆదివారం సాయంత్రం పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ల సంచారం తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని కనీసం ఐదు సున్నిత ప్రాంతాల్లో ఈ డ్రోన్ల కదలికలను భద్రతా దళాలు గుర్తించాయి. భారత భూభాగంలోకి చొరబడిన డ్రోన్లు కొద్దిసేపు తచ్చాడిన అనంతరం తిరిగి పాకిస్థాన్ వైపు మళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది.

Science Awards 2025:భారత సంతతి గణిత శాస్త్రవేత్త నళిని జోషికి ఎన్‌ఎస్‌డబ్ల్యూ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు...!

రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని గనియా–కల్సియన్ గ్రామం సమీపంలో డ్రోన్ కదలికలను గమనించిన ఆర్మీ దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన సైన్యం డ్రోన్‌పై మెషీన్ గన్లతో కాల్పులు జరిపింది. ఇదే సమయంలో రాజౌరీ జిల్లా తర్యత్ ప్రాంతంలోని ఖబ్బర్ గ్రామం వద్ద వెలుగులు జిమ్మే డ్రోన్‌లాంటి వస్తువు కనిపించి ఒక్కసారిగా మాయమైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం!

ఇదే తరహాలో సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్, పూంచ్ జిల్లా మాన్‌కోట్ సెక్టార్ పరిధుల్లో కూడా అనుమానాస్పద డ్రోన్ల కదలికలను అధికారులు ధ్రువీకరించారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా మాదకద్రవ్యాలను భారత భూభాగంలోకి జారవిడిచే ప్రయత్నం జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌, పోలీసులు సంయుక్తంగా భారీ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. అడవులు, గ్రామీణ ప్రాంతాలు, ఖాళీ పొలాల్లో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.

Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక!

ఇటీవలే సాంబా జిల్లా పాలూరా గ్రామం సమీపంలో డ్రోన్ ద్వారా జారవిడిచిన రెండు పిస్టల్స్‌, ఒక గ్రెనేడ్‌, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తాజా డ్రోన్ కదలికలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ డే సమీపిస్తున్న తరుణంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశ భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని భద్రతా దళాలు స్పష్టం చేశాయి.

AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..!
Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి!
హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్ - రెండింటిలో ఏ స్యూటీ కొనడం బెస్ట్! ధర, ఫీచర్లు తెలుసుకోండి.. నమ్మకానికి మరో పేరు!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.!
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్!
Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం!

Spotlight

Read More →