Hormuz: భారతీయ నావికులకు భరోసా.. వ్యూహాత్మక జలసంధిలో సురక్షితంగా సాగిన ఎల్ఎన్జీ రవాణా!
Hormuz: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతీయ ఎల్ఎన్జీ (LNG) ట్యాంకర్ ‘దిశ’ కీలకమైన హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత ఈ మార్గాన్ని దాటిన తొలి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్గా దిశ గుర్తింపు పొందింది.
భారత్కు గర్వకారణం.. హర్ముజ్ మార్గంలో తొలి భారతీయ ఎల్ఎన్జీ నౌక ప్రయాణం విజయవంతం..
62 వేల టన్నుల ఎల్ఎన్జీతో సురక్షితంగా గమ్యానికి బయల్దేరిన ‘దిశ’ ట్యాంకర్..
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతీయ ఎల్ఎన్జీ (LNG) ట్యాంకర్ ‘దిశ’ కీలకమైన హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత ఈ మార్గాన్ని దాటిన తొలి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్గా దిశ గుర్తింపు పొందింది.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్టియం నిర్వహణలో ఉన్న ఈ నౌకను పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ చార్టర్ చేసింది. ఈ నౌకలో సుమారు 62,370 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ రవాణా అవుతోంది.
అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటన తర్వాత హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిన తొలి వాణిజ్య నౌకల్లో ‘దిశ’ కూడా ఒకటిగా నిలిచింది.
కేంద్ర ఓడరేవులు, నౌకాయాన మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘దిశ’ గుజరాత్లోని దహేజ్ పోర్టుకు ఈ నెల 18వ తేదీన చేరుకోనుంది. ఇప్పటివరకు ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని 10 భారత జెండా నౌకలు, 5 విదేశీ జెండా నౌకలు కలిపి మొత్తం 15 నౌకలు సురక్షితంగా దాటినట్లు అధికారులు తెలిపారు.
భారతీయ నావికులు, నౌకల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, షిప్పింగ్ కంపెనీలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై సైనిక చర్యలు చేపట్టడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దానికి ప్రతిగా ఇరాన్ చర్యలు తీసుకోవడంతో హర్ముజ్ జలసంధి ద్వారా సముద్ర రవాణాపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో భారత నౌక సురక్షితంగా ప్రయాణించడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.
Be the first to react