LIVE
World History: ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు.. ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! ఆ దేశం ఎక్కడుంది?  •  Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  • 
Gulf

Hormuz: భారతీయ నావికులకు భరోసా.. వ్యూహాత్మక జలసంధిలో సురక్షితంగా సాగిన ఎల్ఎన్జీ రవాణా!

Hormuz: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతీయ ఎల్ఎన్జీ (LNG) ట్యాంకర్ ‘దిశ’ కీలకమైన హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత ఈ మార్గాన్ని దాటిన తొలి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్‌గా దిశ గుర్తింపు పొందింది.

Kasthuri S 1 min read
Hormuz
Hormuz

భారత్‌కు గర్వకారణం.. హర్ముజ్ మార్గంలో తొలి భారతీయ ఎల్ఎన్జీ నౌక ప్రయాణం విజయవంతం..

62 వేల టన్నుల ఎల్ఎన్జీతో సురక్షితంగా గమ్యానికి బయల్దేరిన ‘దిశ’ ట్యాంకర్..

న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతీయ ఎల్ఎన్జీ (LNG) ట్యాంకర్ ‘దిశ’ కీలకమైన హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత ఈ మార్గాన్ని దాటిన తొలి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్‌గా దిశ గుర్తింపు పొందింది.

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్టియం నిర్వహణలో ఉన్న ఈ నౌకను పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ చార్టర్ చేసింది. ఈ నౌకలో సుమారు 62,370 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ రవాణా అవుతోంది.

అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటన తర్వాత హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిన తొలి వాణిజ్య నౌకల్లో ‘దిశ’ కూడా ఒకటిగా నిలిచింది.

కేంద్ర ఓడరేవులు, నౌకాయాన మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘దిశ’ గుజరాత్‌లోని దహేజ్ పోర్టుకు ఈ నెల 18వ తేదీన చేరుకోనుంది. ఇప్పటివరకు ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని 10 భారత జెండా నౌకలు, 5 విదేశీ జెండా నౌకలు కలిపి మొత్తం 15 నౌకలు సురక్షితంగా దాటినట్లు అధికారులు తెలిపారు.

భారతీయ నావికులు, నౌకల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, షిప్పింగ్ కంపెనీలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దానికి ప్రతిగా ఇరాన్ చర్యలు తీసుకోవడంతో హర్ముజ్ జలసంధి ద్వారా సముద్ర రవాణాపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో భారత నౌక సురక్షితంగా ప్రయాణించడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…