ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన ప్రారంభమయ్యాక పరిపాలన అంటే అర్థాలు మారిపోయాయి.
ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజల సంక్షేమం అభివృద్ధి రాష్ట్రము యొక్క అభివృద్ధి పట్ల పనిచేయాలి.
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారాన్ని వ్యాపారంగా మార్చి వేశారు.
ప్రైవేటు వ్యక్తులు చేయవలసిన పలు వ్యాపారాలు ప్రభుత్వమే చేపడుతుంది.
ప్రభుత్వం చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది.
ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ప్రజలకు విద్య వైద్యం అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తుంటారు.
ఈ ప్రభుత్వం మాత్రం విద్య వైద్యాన్ని కార్పొరేట్ రంగాలకు వదిలేసి అమ్మ ఒడి ఆరోగ్యశ్రీ అంటూ విద్య వైద్యానికి సొమ్ములు చెల్లిస్తున్నారు.
ప్రైవేటు వ్యక్తులు చేసే మద్యం వ్యాపారం ఇసుక వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ ప్రభుత్వం చేస్తుంది.
పేద ప్రజల ఆకలి తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రేషన్ ద్వారా బియ్యం,కందిపప్పు, పామాయిల్,పంచదార వంటి నిత్యవసర వస్తువులు సరఫరా చేసేవారు.
ఈ ప్రభుత్వంలో కేవలం రేషన్ బియ్యం ఒక్కటి మాత్రమే ఇస్తూ వాటిని ఇవ్వడానికి వాహనాలను కొనుగోలు చేసి కాంట్రాక్ట్ పద్ధతిపై సిబ్బందిని పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపు తెచ్చిన నాయకుడు ఈయన.
తల్లికి కూడు పెట్టలేని వాడు పిన్నమ్మకు సారి పెడతాను అన్నట్లుగా ఈయన వ్యవహార శైలి ఉంది.
ఒక్క రాజధానికి దిక్కులేని పరిస్థితులలో మూడు రాజధానులు అంటూ ఐదేళ్లు రాజధాని లేని రాష్ట్రాన్ని నడిపిన ఏకైక ముఖ్యమంత్రిగా ఈయన రికార్డ్ సాధించారు.
తోపుడుబండ్ల పైన,కిళ్ళి కొట్లలో,డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తుంటే కోట్ల రూపాయల విలువైన మద్యం వ్యాపారాలలో మాత్రం ఈయన డిజిటల్ కరెన్సీని నిషేధించిన ఘనుడు.
మద్యం ఇసుక వ్యాపారాల ద్వారా ఈయన ప్రభుత్వపరంగా వ్యాపారం నిర్వహిస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు.
ప్రభుత్వం చేసే పనులను ప్రకటనల రూపంలో సాక్షి పత్రిక టీవీలలో ప్రకటనలు గుర్తిస్తూ కోట్ల రూపాయలను ప్రజా సంపదను దండుకుంటున్నారు.
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా అడుగంటి పోయింది.
కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడవలసిన ఈ ప్రభుత్వంలోని పాలకుల పుణ్యమా అని ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
రాష్ట్రంలో అధికారులు ప్రజల కొరకు చేయవలసిన పనులను విస్మరించి వైసిపి పార్టీ సేవలో తరిస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వ పెద్దల చేతిలో కీలుబొమ్మగా మారి ప్రజలపైనే దాడులకు తెగబడుతున్నారు.
ఎన్నికలు అతి తొందర్లో వస్తున్న తరుణంలో ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై ప్రజలు నిరసనల రూపంలో రోడ్డు ఎక్కుతున్నారు.
గత ప్రభుత్వంలో పేద ప్రజల కొరకు కట్టించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా వాటిని ఈ ప్రభుత్వం శిథిలావస్థకు తీసుకువచ్చింది.
గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని నిర్మాణంలో బాగా నిర్మించిన భవనాలు నిర్మానుషంగా మారాయి.
అమరావతి రాజధానిలో నిర్మించిన రోడ్లను సైతం పెకలించుకు పోయారు.
ప్రజలకు ఉదయం 8 గంటల నుండి రాత్రి పది గంటల వరకు సేవలందించే మీసేవ కేంద్రాలను నిర్వీర్యం చేసి అవినీతిని పెంచి పోషించేలా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు.
సామాన్య ప్రజల సైతం భయపడే విధంగా ఆస్తి పన్నులు, విద్యుత్ చార్జీలు, గ్యాస్ పెట్రోల్ డీజిల్ వంటి వాటి ధరలను పెంచుకుంటూ పోతూ సామాన్యుడి బ్రతుకు భారంగా మార్చివేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి 20 ఏళ్లు వెనకకు పోయింది.
ఒకప్పుడు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమలో మాత్రమే ఉండేవి.
ఈయన పాలన పుణ్యమా అని రాష్ట్ర మొత్తం వెనుకబడిన ప్రాంతంగా తయారయింది.
ప్రజలు బాధలు పడుతూ ఉంటూ గొంతు ఎత్తి ప్రశ్నిస్తే వైసిపి నేతల గుండా గిరి చేస్తున్నారు.
ప్రజల గొంతుకుగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బరాయించి జైళ్లకు పంపుతున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేరుకే గాని పూర్తిగా నియంత పాలన సాగుతుందనడంలో అతిశయోక్తి లేదు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి