LIVE
IndiGo fligth: హై అలర్ట్.. లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు... టాయిలెట్ లో కలకలం రేపిన నోట్!  •  Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!  •  Praja Vedika: రేపు (13/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  అమెరికా మిస్సైల్ దాడిలో విశాఖ యువకుడి దుర్మరణం... చంద్రబాబు ఆరా!!  •  Jobs: దుబాయ్‌లో ఉద్యోగాలు... నెలకు రూ.1.12 లక్షల జీతం... గోల్డెన్ ఛాన్స్ మీకోసమే!  •  Amaravathi Works: అమరావతి నిర్వాసితులకు గుడ్ న్యూస్... ఏడాది పాటు నెలకు రూ.10 వేల అద్దె!  •  Horticulture: భారత్‌లో ఉద్యానవన పంటల ఉత్పత్తికి భారీ వృద్ధి! 3,778 లక్షల టన్నులకు చేరనున్న హార్టికల్చర్ ఉత్పత్తి!  •  Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ! కేవలం 30 రోజుల్లో..  •  AP Farmers: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... కీలక ఆదేశాలు... దాదాపు పదేళ్ల తర్వాత...!!  •  H1B Visa: వీసా బాదుడుకు యూఎస్ కోర్టు బ్రేక్... వెనక్కి తగ్గని ట్రంప్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
World

Dubai Updates: దుబాయి బాధితులకు బుర్జీల్ హోల్డింగ్స్ రూ.2.60 కోట్ల భారీ సాయం.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు!

Dubai Updates: ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కార్మికులు, గాయపడిన తొమ్మిది మందికి 10 లక్షల దిర్హంలు (రూ. 2.60 కోట్లు) మానవతా సహాయ ప్యాకేజీ ప్రకటించిన యూఏఈ కి చెందిన బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్,  ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ డా. షంషీర్ వయలిల్ కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతఙ్ఞతలు తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
mla medipalli satyam met with burjeel representatives in dubai
mla medipalli satyam met with burjeel representatives in dubai
  • రోడ్డు ప్రమాద బాధితులకు భారీ సహాయం ప్రకటించిన డా. షంషీర్ వయలిల్ ను హైదరాబాద్ కు ఆహ్వానించిన ఎమ్మెల్యే..

  • world: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష దిర్హంలు (రూ. 26 లక్షలు) సహాయం..  

Dubai Updates: ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కార్మికులు, గాయపడిన తొమ్మిది మందికి 10 లక్షల దిర్హంలు (రూ. 2.60 కోట్లు) మానవతా సహాయ ప్యాకేజీ ప్రకటించిన యూఏఈ కి చెందిన బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్,  ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ డా. షంషీర్ వయలిల్ కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతఙ్ఞతలు తెలిపారు. 

డా. షంషీర్ వయలిల్ అందుబాటులో లేనందున,  ఆయన కంపెనీ ప్రతినిధులు ఎ. విజయ కుమార్, అహ్మద్ బిన్ సులేమాన్, ఎం. ఉన్ని కృష్ణన్, డా. పంకజ్ కుమార్ భట్ లను శుక్రవారం దుబాయిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్ కొట్టాల సత్యం గౌడ్, దుబాయి లోని తెలంగాణ సామాజిక కార్యకర్తలు జువ్వాడి శ్రీనివాస రావు, శామ్యూల్ దామెర, సలావుద్దీన్, ఎస్వి రెడ్డి,  ద్యాగతి మహిపాల్ యాదవ్, సుతారి సత్యనారాయణ, కోరెపు మల్లేష్, ఎమ్మెల్యే పిఎ ముత్యం శంకర్ తదితరులున్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం, డా. షంషీర్ వయలిల్ తో సహా 'బుర్జీల్' ప్రతినిధులను హైదరాబాద్ కు ఆహ్వానించారు. సీఎం ఏ. రేవంత్ రెడ్డి సమక్షంలో మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేద్దామని ప్రతిపాదించారు. ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురిలో, ముగ్గురు జగిత్యాల జిల్లాకు చెందిన వారున్నారు. ఒక్కొక్కరికి లక్ష దిర్హంలు (రూ. 26 లక్షలు) చొప్పున ఆర్ధిక సహాయం అందనున్నది. గాయపడిన తొమ్మిది మందికి వైద్య చికిత్స, పునరావాసం, ప్రభావిత కుటుంబాల పిల్లల విద్య కోసం కూడా సహాయం చేస్తారు. 

అంతకు ముందు రోజు ఎమ్మెల్యే దుబాయి లోని  భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించి కాన్సులేట్ అధికారులను కలుసుకున్నారు. మృతదేహాల తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని రాషేద్ ఆసుపత్రిలో పరామర్శించారు. కాగా ఎమ్మెల్యే పర్యటనను దుబాయి లోని సామాజిక కార్యకర్తలు గుండెల్లి నర్సింలు, సుతారి సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ నంగి దేవేందర్ రెడ్డి లు సమన్వయం చేశారు.

Be the first to react

More Coverage

India: భారతీయ సిబ్బంది నౌకపై దాడి.. అమెరికాకు భారత్‌ మరోసారి గట్టి నిరసన! 48 గంటల్లో రెండోసారి..

India: భారతీయ సిబ్బంది నౌకపై దాడి.. అమెరికాకు భారత్‌ మరోసారి గట్టి నిరసన! 48 గంటల్లో రెండోసారి..

ఒమన్‌ తీరంలో భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు కొనసాగుతుండటంతో అమెరికా తీరు పట్ల భారత్…

US attack oil tanker: సంచలనం.. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా మిస్సైల్ దాడి.. మృతుల్లో విశాఖ నావికుడు పట్నాల సురేష్!

US attack oil tanker: సంచలనం.. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా మిస్సైల్ దాడి.. మృతుల్లో విశాఖ నావికుడు పట్నాల సురేష్!

US attack oil tanker: గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా సైనిక బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు…

Indian crew: భారత సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి.. గల్ఫ్ జలాల్లో పరాకాష్టకు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు!

Indian crew: భారత సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి.. గల్ఫ్ జలాల్లో పరాకాష్టకు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు!

Indian crew: ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వ…

H-1B Visa: అగ్ర దేశాల వీసాల్లో మనోళ్లదే హవా.. స్థానికుల కన్నా భారత నిపుణులకే ఎక్కువ జీతాలు.. ఎందుకంటే?

H-1B Visa: అగ్ర దేశాల వీసాల్లో మనోళ్లదే హవా.. స్థానికుల కన్నా భారత నిపుణులకే ఎక్కువ జీతాలు.. ఎందుకంటే?

H-1B Visa: ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు భారత్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతోంది. అగ్రరాజ్…