హైదరాబాద్లో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన జడేజా అర్ధ సెంచరీ బాదాడు.
జడేజా ఆటతీరుపై ఇంగ్లండ్ మాజీ స్కిప్పర్ మైఖేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు.
ఇప్పటికి జడేజానే ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్ అని ఆకాశానికెత్తేశాడు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తొలి ఇన్నింగ్స్లో జడేజా 87 పరుగులు చేసి రూట్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఈ నేపథ్యంలో వాన్ పై విధంగా స్పందించాడు.
బెన్స్టోక్స్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి మరీ జడేజాను ప్రశంసించాడు.
అతడే అత్యుత్తమ ఆల్రౌండర్ అని కితాబిచ్చాడు. కాగా, ఇంగ్లండ్ ఈ ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది.
ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసి భారత్పై 198 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి