KV Update: విద్యార్థులకు గుడ్ న్యూస్…! ఆ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఫిక్స్…!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్తగా కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసిన నేపథ్యంలో, శ్రీకాకుళం జిల్లా పలాసకు కూడా ఒక కేంద్రీయ విద్యాలయం కేటాయించడం స్థానికంగా

2025-12-25 10:30:00
Tirumala: స్థానిక భక్తులకు టీటీడీ బిగ్ గిఫ్ట్…! వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్…!


ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్తగా కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసిన నేపథ్యంలో, శ్రీకాకుళం జిల్లా పలాసకు కూడా ఒక కేంద్రీయ విద్యాలయం కేటాయించడం స్థానికంగా హర్షాతిరేకాలకు కారణమైంది. ఈ కేంద్రీయ విద్యాలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంలో భాగంగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పలాస ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Amazon Expansion: నిరుద్యోగులకు పండగే పండగ! అమెజాన్ భారీ విస్తరణ.. 833 మందికి ఉద్యోగాలు!

పలాసలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి తాత్కాలిక ఏర్పాట్లుగా, ప్రస్తుతం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) బ్యారక్స్‌ను ఉపయోగించనున్నారు. ఈ బ్యారక్స్‌ను విద్యాలయ అవసరాలకు అనుగుణంగా మార్చే పనులు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, ఆర్పీఎఫ్ సిబ్బందికి ప్రత్యామ్నాయంగా రైల్వే అతిథిగృహం మరియు రైల్వే గృహాల ప్రాంతాల్లో వసతి సదుపాయాలు కల్పించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. అవసరమైతే అదనపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లను తాత్కాలికంగా నిర్మించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Christmas Mass 2025: వాటికన్ సిటీ నుంచి ప్రపంచానికి శాంతి పిలుపు.. పోప్ లియో XIV తొలి క్రిస్మస్!!

ఈ నేపథ్యంలో పలాస ఆర్డీవో జి. వెంకటేష్‌ నేతృత్వంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ ఈ. శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ వి. గిరి, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది సూచన మేరకు రైల్వే అతిథిగృహంలో ఖాళీగా ఉన్న వసతి సముదాయాన్ని పరిశీలించగా, అక్కడ సుమారు 20 మందికి మాత్రమే వసతి లభిస్తుందని గుర్తించారు. ఇది సరిపోదని భావించి, సమీపంలోని రైల్వే గృహాలను కూడా పరిశీలించారు. మహిళా ఆర్పీఎఫ్ సిబ్బందికి అనుకూలంగా రైల్వే వైద్యుడి నివాసాన్ని కూడా పరిశీలించగా, ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో అది అనువైనదిగా నిర్ణయించారు.

Anganwadi Jobs: అంగన్వాడీ పోస్టుల భర్తీ.. డిసెంబర్ 31 వరకు గడువు! పది పాసైతే చాలు... మీ ఊర్లోనే ఉద్యోగం!

ఈ అన్ని వివరాలను ఇంటి నెంబర్లతో సహా జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని ఆర్డీవో వెంకటేష్ తెలిపారు. డిసెంబరు నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరోసారి కేంద్ర బృందం పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే ఒకటి నుంచి ఐదు తరగతులను ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు దిశగా జరుగుతున్న ఈ ప్రయత్నాలు, ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
 

Indian Passport: భారత పాస్‌పోర్ట్‌పై టెకీ ఆవేదన.. ఇక విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు!
Navi Mumbai Airport: నవి ముంబై విమానాశ్రయం ప్రారంభం.. తొలి విమానం ల్యాండింగ్‌తో చరిత్రాత్మక ఘట్టం!!
District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...?
Bus Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని బస్సు దగ్ధం! 17 మంది మృతి!
Health Tips: లెమన్ టీ తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల?
AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!!

Spotlight

Read More →