Organic Food: ఆరోగ్యానికి చిరుధాన్యాలే శ్రీరామరక్ష! గిరిజన ఆహార ఉత్పత్తులకు సీఎం ప్రోత్సాహం! Skill Development: ఉన్నత విద్యలో ఏపీ నంబర్ వన్ కావాలి..! కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు Sagar Defence: సముద్ర తీరప్రాంత జిల్లాలకు పారిశ్రామిక కళ..! మత్స్యకార కుటుంబాలకు మహర్దశ! Greenfield Expressway: హైదరాబాద్ టు విజయవాడ వయా నాగార్జున సాగర్.. సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ బాట! Chandrababu Naidu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మార్కులు! అగ్రస్థానంలో ఎవరున్నారంటే? Iconic Structure: అమరావతిలో అద్భుతం..! ఐకానిక్ సెల్ టవర్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు! Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం! Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! బెంగళూరు టూ విజయవాడ.. ఇక విమాన వేగంతో ప్రయాణం! AP Tourism: అమరావతిలో 'క్రియేటివ్ సిటీ'..! ఏపీ టూరిజంపై సీఎం చంద్రబాబు భారీ ప్లాన్! LPG Gas: వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భరోసా! బుక్ చేసిన 48 గంటల్లోనే... కొత్త నిబంధనలు! Organic Food: ఆరోగ్యానికి చిరుధాన్యాలే శ్రీరామరక్ష! గిరిజన ఆహార ఉత్పత్తులకు సీఎం ప్రోత్సాహం! Skill Development: ఉన్నత విద్యలో ఏపీ నంబర్ వన్ కావాలి..! కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు Sagar Defence: సముద్ర తీరప్రాంత జిల్లాలకు పారిశ్రామిక కళ..! మత్స్యకార కుటుంబాలకు మహర్దశ! Greenfield Expressway: హైదరాబాద్ టు విజయవాడ వయా నాగార్జున సాగర్.. సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ బాట! Chandrababu Naidu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మార్కులు! అగ్రస్థానంలో ఎవరున్నారంటే? Iconic Structure: అమరావతిలో అద్భుతం..! ఐకానిక్ సెల్ టవర్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు! Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం! Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! బెంగళూరు టూ విజయవాడ.. ఇక విమాన వేగంతో ప్రయాణం! AP Tourism: అమరావతిలో 'క్రియేటివ్ సిటీ'..! ఏపీ టూరిజంపై సీఎం చంద్రబాబు భారీ ప్లాన్! LPG Gas: వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భరోసా! బుక్ చేసిన 48 గంటల్లోనే... కొత్త నిబంధనలు!

Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!!

Davos Summit 2026: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించడంతో 25 శాతం టారిఫ్‌లను ఎత్తివేసే దిశగా అమెరికా ఆలోచిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దావోస్ వేదికగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలు భారత్–అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపుగా మారాయి.

Published : 2026-01-24 17:30:00
Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!!

భారత్‌పై విధించిన అదనపు టారిఫ్‌లను తగ్గించే దిశగా అమెరికా ఆలోచన చేస్తోందన్న సంకేతాలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల అంశాన్ని కేంద్రంగా చేసుకుని గత కొంతకాలంగా భారత్–అమెరికా మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలమైన సూచనలుగా మారాయి.

Luxury Resorts: సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్! నీలి సముద్రం.. తెల్లటి ఇసుక.. ఈ 10 రిసార్టులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా 25 శాతం వరకు అదనపు పన్నులు విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు శుద్ధి రంగంపై ప్రభావం చూపింది. అయితే ఈ టారిఫ్‌ల కారణంగా భారత రిఫైనరీలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయని, రష్యా ఆయిల్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించాయని స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఇదే తమ విధానం సాధించిన పెద్ద విజయమని ఆయన అభివర్ణించడం గమనార్హం.

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు!

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బెసెంట్, అమెరికా విధించిన పన్నుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. గతంలో భారీగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్న భారత సంస్థలు ఇప్పుడు ఆ కొనుగోళ్లను తగ్గించాయని, దీని వల్ల అమెరికా లక్ష్యం నెరవేరిందన్నారు. ప్రస్తుతం టారిఫ్‌లు ఇంకా అమల్లో ఉన్నప్పటికీ, భారత్ ఇదే ధోరణిని కొనసాగిస్తే దౌత్య మార్గాల్లో పన్నులు ఎత్తివేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు. దీన్ని ఒక రకమైన “పరీక్షా దశ”గా అభివర్ణించారు.

Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!!

అదే సమయంలో యూరోపియన్ దేశాల వైఖరిపై కూడా బెసెంట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ, యూరప్ దేశాలు పరోక్షంగా రష్యా చమురునే వినియోగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. భారత్ తక్కువ ధరకు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి, శుద్ధి చేసిన తర్వాత అదే ఆయిల్‌ను యూరోపియన్ మార్కెట్లకు ఎగుమతి చేస్తోందని తెలిపారు. అంటే యూరప్ దేశాలే తిరిగి రష్యా చమురుకు డబ్బులు చెల్లిస్తున్నాయని, ఇది వారి ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని విమర్శించారు.

యూరప్ దేశాలు భారత్‌పై ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదన్న ప్రశ్నకూ బెసెంట్ సమాధానం ఇచ్చారు. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలన్న లక్ష్యంతోనే యూరోపియన్ యూనియన్ మౌనంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొనడాన్ని ఉదాహరణగా చూపించారు. ప్రపంచ జనాభాలో పెద్ద వాటా, గ్లోబల్ జీడీపీలో కీలక పాత్ర ఉన్న భారత్‌తో ఒప్పందం కోసం యూరప్ రాజీ పడుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరోవైపు, అమెరికా కాంగ్రెస్‌లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరింత కఠినమైన సుంకాలు విధించాలన్న ప్రతిపాదనలు కూడా చర్చలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి, దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, 140 కోట్ల మందికి తక్కువ ధరకు ఇంధనం అందించడమే ‘ఇండియా ఫస్ట్’ విధానమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఎంత ఉన్నా, వ్యూహాత్మక స్వతంత్రతను భారత్ కాపాడుకుంటుందన్న సందేశాన్ని కూడా ఆయన ఇచ్చారు.

Spotlight

Read More →