Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Ravikumar: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు.! Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Ravikumar: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు.! Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై..

Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.!

Rama Temple: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం శంకుస్థాపన జరిగింది. భారీ పోలీసు బందోబస్త్ మధ్య, వేలాది మంది భక్తుల సమక్షంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఆయన అర్ధాంగి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Published : 2026-05-03 15:01:00
  • ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని రఘురామ స్పష్టీకరణ..
     
  • Politics: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం..

Rama Temple: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో గత కొంతకాలంగా ఉత్కంఠకు దారితీసిన రామాలయ పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నిర్ణయించిన 7:14 గంటల శుభ ముహూర్తానికి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన ధర్మపత్నితో కలిసి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. గతంలో ఈ ఆలయ నిర్మాణ విషయమై రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో, ఈసారి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య, వేలాది మంది భక్తుల జయజయధ్వానాలతో ఈ భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొందరు శక్తులు కోర్టులను ఆశ్రయించి అడ్డంకులు సృష్టించాయని విమర్శించారు. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, భక్తిభావంతో అనుకున్న సమయానికే పనులు ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ఈ రామాలయాన్ని అత్యంత పటిష్టమైన కృష్ణశిలతో నిర్మిస్తామని, సుమారు 800 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన వెల్లడించారు. ఈ మహత్కార్యం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత శ్రీరామనవమి వేళ ఇక్కడ జరిగిన అవాంఛనీయ ఘటనలు హైకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతులతోనే పనులు చేపట్టాలని న్యాయస్థానం గతంలో సూచించింది. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే పనులకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆకివీడు వ్యాప్తంగా నిఘా పెంచారు. ఎట్టకేలకు వివాదాలకు తెరదించి, ఆలయ నిర్మాణ పనులు మొదలుకావడంతో స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తి విశ్వాసాల మధ్య సాగిన ఈ కార్యక్రమం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Spotlight

Read More →