Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.!

Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పరామర్శించనున్నారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు.

Published : 2026-05-02 11:20:00
  • ముక్కుకు శస్త్రచికిత్స తర్వాత హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్..
     
  • Politics: దివంగత పారిశ్రామికవేత్త జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా పరామర్శించనున్న సీఎం..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) హైదరాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆయన పరామర్శించనున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని పవన్ నివాసానికి చేరుకోనున్న సీఎం, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. గత నెలలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో అస్వస్థతకు గురైన పవన్, వైద్యుల సూచన మేరకు ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో, ప్రస్తుతం ఆయన తన నివాసంలోనే కోలుకుంటున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మరికొన్ని పరామర్శ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ సెరామిక్స్ అధినేత జీఎన్ నాయుడు కుటుంబాన్ని చంద్రబాబు కలవనున్నారు. నందగిరి హిల్స్‌లోని వారి నివాసానికి వెళ్లి, శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. ఒకే పర్యటనలో అటు రాజకీయ భాగస్వామిని, ఇటు ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించనుండటం గమనార్హం. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి పాలనా వ్యవహారాల్లో పాలుపంచుకోవాలని కూటమి శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

Spotlight

Read More →