మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా: షర్మిల
దిల్లీ: వైతెపాను కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. “వైఎస్సార్ జీవితామంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారు. రాహుల్ను ప్రధానిగా చూడటం మా నాన్న కల. నేను మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే లౌకిక పార్టీ కాంగ్రెస్. ఇవాల్టి నుంచి కాంగ్రెస్లో వైతెపా ఒక భాగం. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా” అని షర్మిల వెల్లడించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి