న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారతంలో 40-50 స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ‘మిషన్ సౌత్’లో భాగంగానే ప్రధాని మోదీ ఇటీవల తమిళనాడు, కేరళల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తమిళనాట మంగళవారం తిరుచిరాపల్లి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ఆయన.. బుధవారం కేరళలోని త్రిసూర్లో, కేంద్ర పాలిత ప్రాంతం లక్షదీవుల్లో భారీ రోడ్షోలు నిర్వహించారు. ప్రధానంగా త్రిసూర్ రోడ్షోకు 2 లక్షల మంది బీజేపీ మహిళా కార్యకర్తలు హాజరవడం విశేషం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ దఫా 350 లోక్సభ స్థానాలు గెలవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇది సాధించాలంటే దక్షిణాదిన కూడా ఎక్కువ సీట్లు గెలవాల్సి ఉంటుంది. దక్షిణ భారతంలో 129 లోక్సభ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో బీజేపీ 29 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇందులోనూ 25 సీట్లు కర్ణాటకలో వచ్చాయి. తెలంగాణలో 4 స్థానాలు గెలిచింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల్లో ఖాతా తెరవలేదు. కర్ణాటకలో నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బలం పెంచుకున్నా.. కనీసం రెండో స్థానమైనా సాధించలేదు.
ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచిన కాంగ్రె్సకు ఈ దఫా లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నష్టాన్ని ఆంధ్ర, తమిళనాడు, కేరళల్లో పూడ్చుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి