LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

USA: డాలస్‌లో మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి

USA: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ పర్యటనకు వచ్చిన జయరాం కోమటి, అమెరికాలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించి బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు.

AndhraPravasi News Desk 1 min read
USA: డాలస్‌లో మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి

డాలస్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జయరాం కోమటి..

ప్రవాస భారతీయుల ఐక్యతకు ప్రతీక గాంధీ మెమోరియల్: జయరాం కోమటి..

డాలస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ పర్యటనకు వచ్చిన జయరాం కోమటి, అమెరికాలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించి బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.

డాలస్ నగరంలోని ఈ ప్రతిష్ఠాత్మక స్మారక స్థలిలో జయరాం కోమటికి ఘన స్వాగతం లభించింది. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు ఆయనకు స్వాగతం పలికి జ్ఞాపికను అందజేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ గుళ్ళపల్లి సహా పలువురు ప్రవాస భారతీయులు పాల్గొని కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ, దాదాపు పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంటున్న ఈ మహాత్మా గాంధీ స్మారక స్థలి కేవలం ప్రవాస భారతీయులకే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు స్ఫూర్తినిచ్చే కేంద్రంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, అమెరికన్ రాజకీయ ప్రముఖులు కూడా ఈ స్మారక స్థలిని సందర్శించారని ఆయన గుర్తు చేశారు.

ప్రవాస భారతీయుల ఐక్యతకు, భారతీయ విలువల పరిరక్షణకు ఈ గాంధీ మెమోరియల్ ఒక ప్రతీకగా నిలుస్తోందని జయరాం పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టును సాకారం చేయడంలో విశేష కృషి చేసిన మహాత్మా గాంధీ మెమోరియల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూరతో పాటు వారి కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

గాంధీ సిద్ధాంతాలు, శాంతి సందేశం ప్రపంచానికి ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్న జయరాం కోమటి, విదేశాల్లో ఉన్న భారతీయులు తమ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకుంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…