సైకిల్ పై నగర సంచారం, పడవల్లో కలల యాత్ర, పూల తోటల్లో నడక – పర్యాటకులకు మరువలేని అనుభవాలతో నిండిన ఒక మాయాజాల దేశం!!

దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలకు మరో శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ప్రయాణించేలా కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. ఈ రైలు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది. తమిళనాడులోని ఈరోడ్, బీహార్‌లోని జోగ్బనీ స్టేషన్ల మధ్య ఈ రైలు సర్వీసులు నడవనున్నాయి. రెండు వైపులా ఒక్కొక్క రైలు ప్రవేశపెడుతున్నారు.

ED: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు! ఈడీ ఎంట్రీతో ఐదు రాష్ట్రాల్లో సోదాలు..!

మొదటగా ఈరోడ్ నుంచి జోగ్బనీ వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 16601)ను ఈ నెల 25వ తేదీన ప్రారంభించనున్నారు. ఉదయం 8.10కు ఈరోడ్ నుంచి బయలుదేరిన ఈ రైలు, ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు జంక్షన్‌కు సాయంత్రం 4.40కు చేరుకుంటుంది. తర్వాత ఒంగోలులో సాయంత్రం 6.58కు, విజయవాడలో రాత్రి 9.15కు ఆగుతుంది.

ICC rankings: ICC ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా హవా.. అగ్రస్థానంలో!

ఆ తర్వాత తెలంగాణలో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఖమ్మం వద్ద రాత్రి 11.09కు, వరంగల్‌లో అర్థరాత్రి 12.53కు (తరువాతి రోజు), మంచిర్యాలలో తెల్లవారుజామున 2.59కు ఆగుతుంది. అనంతరం దీని ప్రయాణం కొనసాగి, జోగ్బనీకి శనివారం 27వ తేదీన రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది. ఈ విధంగా దక్షిణం నుంచి ఉత్తర భారతదేశం వరకు ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యం కల్పించనుంది.

TTD: వాహనసేవలతో పాటు మూలవిరాట్‌ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు..! భక్తులకు భరోసా ఇచ్చిన టీటీడీ..!

జోగ్బనీ నుంచి తిరిగి వచ్చే రైలు సర్వీసు కూడా షెడ్యూల్ చేశారు. ఈ రైలు 28వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 3.15కు జోగ్బనీ నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణలోని మంచిర్యాలకు 30వ తేదీ మంగళవారం ఉదయం 9.04కు చేరుకుంటుంది. ఆ తర్వాత వరంగల్‌లో 10.58కు, ఖమ్మంలో 12.24కు, విజయవాడలో 2.40కు, ఒంగోలులో సాయంత్రం 5.03కు, గూడూరులో రాత్రి 7.50కు ఆగుతుంది.

Trump tweet: ట్రంప్ తీవ్ర ఆరోపణ.. భారత్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు!

చివరగా ఈ రైలు అక్టోబర్ 1వ తేదీ బుధవారం ఉదయం 7.20కు ఈరోడ్ చేరుకుంటుంది. అధికారులు తెలిపిన ప్రకారం, ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్‌తో పాటు జనరల్ మరియు సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. దీంతో అన్ని వర్గాల ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Trump: బిట్‌కాయిన్ చేతబట్టి ట్రంప్ బంగారు విగ్రహం! అదే రోజు ఫెడ్ వడ్డీ రేట్ల కోత..!
APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ భారీ అప్రెంటిస్ నియామకాలు! జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇదిగో..!
DSC: అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా.. DSC!
AP Heavy rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాబోయే 3 గంటల్లో వర్షాలు.. ఐఎండీ వార్నింగ్! ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ..
Post Office Scheme: ఈ స్కీమ్‌తో లైఫ్ సెటిల్! నెలకు రూ.5,000 పెట్టుబడితో రూ.16,00,000లు లాభం!
Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఆర్టీసీలో 1743 పోస్టులకు నోటిఫికేషన్! దరఖాస్తు గడువు.. పూర్తి వివరాలు ఇవే!