Modi: మోదీ ట్వీట్.. భారత్ నేపాల్ స్నేహ బంధానికి ప్రతీక!

డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పేకు కీలక దెబ్బ తగిలింది. త్వరలో ఐపీఓకు వెళ్లాలని సన్నాహాలు చేస్తున్న ఈ సంస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రూ.21 లక్షల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) నిబంధనలను ఉల్లంఘించిందన్న కారణంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.

Fire: మాదాపూర్ ఐటీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..! ఫర్నీచర్, కంప్యూటర్లు బూడిద..!

ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫోన్‌పే నిర్వహిస్తున్న ఎస్క్రో ఖాతాలో రోజువారీగా ఉండాల్సిన నిల్వలు, కస్టమర్లు మరియు వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తానికి తగ్గుగా ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా ఈ లోటు విషయాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకురావడంలో కూడా ఫోన్‌పే విఫలమైందని పేర్కొంది. దీంతో పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్స్ చట్టం-2007 కింద జరిమానా విధించామని స్పష్టం చేసింది.

AP Govt: ఉపాధి హామీలో కూలీలకు కొత్త రూల్స్..! అది లేకుంటే వేతనం లేదు..!

2023 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు ఫోన్‌పే కార్యకలాపాలపై ఆర్బీఐ విస్తృత తనిఖీలు జరిపింది. ఈ క్రమంలో ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఫోన్‌పే సమాధానం ఇచ్చినా, విచారణ తర్వాత సరైన న్యాయపరమైన ఆధారాలు లేకపోవడంతో ఈ నెల 10న రూ.21 లక్షల జరిమానా విధించడాన్ని తుది నిర్ణయంగా తీసుకుంది.

Russia: రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం..! 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు..!

అయితే, ఈ చర్య నియంత్రణాపరమైనదే గానీ వినియోగదారుల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దేశంలో యూపీఐ మార్కెట్‌లో 48.64% వాటాతో ఫోన్‌పే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో ఐపీఓకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న దశలో ఆర్బీఐ జరిమానా విధించడం పరిశ్రమలో విస్తృత చర్చనీయాంశమైంది.

AP Schemes: దసరా కానుక.. ఒక్కక్కరికి రూ.15 వేలు! అర్హతలు.. దరఖాస్తు వివరాలు!
Indian Railways: అక్టోబర్ 5 నుండి 52 ప్రత్యేక రైళ్లు! రూట్... షెడ్యూల్ ఇదే!
Iphone 17 ప్రీ-బుకింగ్ స్టార్ట్! ధర ఎంత.. ఎలా బుక్ చేసుకోవాలి! ఫుల్ డిటైల్స్!
Praja Vedika: నేడు (13/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Rythu Bandhu: ఏపీ రైతులకు తీపి కబురు! మంత్రి కీలక ప్రకటన! క్వింటాకు రూ.2,369 ఫిక్స్!