Russia: రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం..! 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ఆధార్ లింకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. అక్టోబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మొదటగా ప్రతి రాష్ట్రం నుంచి రెండు జిల్లాలను ఎంపిక చేయగా, ఏపీలో కర్నూలు, చిత్తూరు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

AP Schemes: దసరా కానుక.. ఒక్కక్కరికి రూ.15 వేలు! అర్హతలు.. దరఖాస్తు వివరాలు!

ప్రస్తుతం జాబ్ కార్డు ఒకరి పేరుతో ఉన్నప్పటికీ, పనికి మరొకరు వచ్చి హాజరు నమోదు చేసుకునే దారుణం విస్తృతంగా జరుగుతోంది. ఫలితంగా నిజమైన లబ్ధిదారులకు కాకుండా మధ్యవర్తులు, సిబ్బంది లాభపడుతున్నారు. ఈకేవైసీ విధానం ద్వారా పని చేయడానికి వచ్చే వ్యక్తి ఆధార్ వివరాలను నేరుగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో ఒకరి బదులు మరొకరు పనిచేయడం అసాధ్యం అవుతుంది.

Indian Railways: అక్టోబర్ 5 నుండి 52 ప్రత్యేక రైళ్లు! రూట్... షెడ్యూల్ ఇదే!

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70.73 లక్షల జాబ్ కార్డులు జారీ చేశారు. అయితే వీటిలో అనేక కార్డులు వాడుకలో లేకపోవడంతో సమస్యలు తలెత్తాయి. కొంతమంది జాబ్ కార్డు ఉన్నవారు పనికి రావడం లేదని, వారి బదులు ఇతరులు హాజరు వేసుకుని డబ్బులు తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ కొత్త వ్యవస్థతో అటువంటి అవినీతి, దోపిడీకి తావు ఉండదని అధికారులు చెబుతున్నారు.

Iphone 17 ప్రీ-బుకింగ్ స్టార్ట్! ధర ఎంత.. ఎలా బుక్ చేసుకోవాలి! ఫుల్ డిటైల్స్!

ఇకపై ఉపాధి పనులకు హాజరయ్యే ప్రతి కూలీ తన ఆధార్ లింక్ చేసిన ఈకేవైసీతో మాత్రమే పనిచేయగలడు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కఠిన చర్యలతో ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెరుగుతుందని, నిజమైన కూలీలకు మాత్రమే వేతనాలు చేరుతాయని అధికారులు నమ్ముతున్నారు. ఈకేవైసీ అమలు వల్ల ఉపాధి హామీ పనుల్లో అవినీతి గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

Praja Vedika: నేడు (13/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Rythu Bandhu: ఏపీ రైతులకు తీపి కబురు! మంత్రి కీలక ప్రకటన! క్వింటాకు రూ.2,369 ఫిక్స్!
AP Government: ఏపీ మహిళలకు శుభవార్త.. వారికి రూ.2 లక్షల వరకు రుణాలు! ఎలా పొందాలో తెలుసుకోండి..
Vice President : నూతన ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం.. ప్రముఖుల హాజరు!
PM Modi: ప్రధాని మోదీ మణిపుర్ పర్యటన ఖరారు.. 5 రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టుల ప్రారంభం!