పూజా హెగ్డే మొదట తెలుగులో ఒక లైలా కోసం చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా నటించింది. ఆ తర్వాత ఆమె చేసిన దువ్వాడ జగన్నాథం (DJ) అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురము సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాలు అందుకుంది. గ్లామర్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ — ఇవన్నీ కలగలిపి ఆమెను టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా నిలబెట్టాయి.
పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాల మీద ఎక్కువ దృష్టి అని చెప్పుకోవాలి అందుకే ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువగా కనిపిస్తోంది. సినిమా వర్గాల ప్రకారం ఎక్కువ పారితోషికం అడగడం వల్ల టాలీవుడ్ నిర్మాతలు ఆమెను సినిమాల తీసుకోలేకపోతున్నారట. కానీ ఇప్పుడు ఆమె మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తుంది. ఈసారి కూడా పాత రేంజ్లోనే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.
ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్తో నటిస్తోంది. ఈ సినిమాలో నటించడానికి పూజా ఏకంగా రూ. 3 కోట్లు తీసుకుంటుందట. ఇది ఆమె మార్కెట్ ఇంకా బలంగానే ఉందని స్పష్టంగా చూపిస్తుంది.
ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ అనే సినిమాలో పూజా ఒక స్పెషల్ సాంగ్లో కనిపించింది. ఆ పాటలో ఆమె ఎనర్జీ, డాన్స్, గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సాంగ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ పైన విషయం కూడా అందరికీ తెలిసిందే. పూజా లుక్, డాన్స్ మూవ్స్ అన్నీ చాలా మంది ఫ్యాన్స్కి నచ్చాయి. దీంతో సౌత్లో ఆమె క్రేజ్ మళ్లీ పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
పూజా కెరీర్ని చూస్తే, ఆమె చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.దుల్కర్ సల్మాన్తో వస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్కి మరో పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర స్ట్రాంగ్గా, ఆకర్షణీయంగా ఉంటుందని తెలిసింది.
ఈ చిత్రానికి దర్శకుడు రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ అనయ్ ఓం గోస్వామి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా. ఈ పాన్-ఇండియా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషలలో విడుదలకానుంది.