AP Promotions: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏపీలో వారందరికీ ప్రమోషన్స్!

ఈ సంవత్సరం వరుస ప్రకృతి విపత్తులు ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా బోహోల్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగి పడి అనేక ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. కనీసం 31 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

High-Speed corridor: గుడ్ న్యూస్... కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీకి మరో కొత్త హై స్పీడ్ కారిడార్! ఈ రోట్లోనే...

మంగళవారం సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో ఈ భారీ భూకంపం నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం బోహోల్ ప్రావిన్స్‌లోని కలపే ప్రాంతానికి తూర్పు-ఆగ్నేయ దిశగా 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపం వల్ల బోగో నగరం దగ్గర ఎక్కువ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. 22కి పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. వాటిలో ఒక పురాతన రాతి చర్చ్ కూడా ఉంది.

Vandebharath Sleeper: భక్తులకు పండుగ కానుక! ఏపీ నుంచి అయోధ్యకు వందే భారత్ స్లీపర్! ఫుల్ షెడ్యూల్!

భూకంపం సంభవించిన వెంటనే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆ తర్వాత పరిస్థితి అంచనాకంటే తక్కువగా ఉండటంతో హెచ్చరికను ఉపసంహరించుకుంది. అయినప్పటికీ భయంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కొండచరియలు విరగడంతో పర్వత ప్రాంతాల్లో అనేక ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కార్తీక్–శ్రీధర్ మధ్య ఘర్షణ… అగ్రిమెంట్ క్యాన్సిల్ పై పెద్ద డ్రామా..జడ్జిమెంట్ డే అంటూ శ్రీధర్ హెచ్చరిక!! ఈరోజు సీరియల్ ఫుల్ ధమాకా!!

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా కొంతమేర నిలిచిపోయినా అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. తీర ప్రాంత ప్రజలకు బీచ్‌లకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కలపేలో నివసిస్తున్న సుమారు 33,000 మంది ప్రజలు భయాందోళనలో ఉన్నారని స్థానిక అధికారులు వెల్లడించారు.

ఎవరికీ తలవంచను దీపికా సంచలన వ్యాఖ్యలు.. సందీప్ రెడ్డి వంగకు పరోక్షంగా కౌంటరేనా?నెట్టింట రచ్చ!

ఫిలిప్పీన్స్ పసిఫిక్ మహాసముద్రంలోని "రింగ్ ఆఫ్ ఫైర్" ప్రాంతంలో ఉండటంతో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. వీటిలో చాలా వరకు తక్కువ తీవ్రతగలవే. అయితే ఈసారి సంభవించిన భూకంపం ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

పనిముట్లను దైవంగా పూజించే విశిష్ట పండుగ! అయుధ పూజ విశేషాలు!
Bhagavad Gita: దేహం నశించేది దేహి నాశనం లేనివాడు, నిత్యుడు.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 19!
Lokesh Airbus meeting: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగంలో మరో మైలురాయిగా లోకేశ్.. ఎయిర్ బస్ సమావేశం!
చెన్నైలో భారీ కలకలం.. 9 విదేశీ రాయబార కార్యాలయాలకు బాంబు బెదిరింపులు.. నగరంలో హై అలర్ట్!
TGPSC: గ్రూప్–3 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితా విడుదల..! 4,500 మందికి పైగా ఎంపిక!