Indoor vegetables: ఇండోర్ గార్డెనింగ్.. త్వరగా పెరిగే 6 రకాల కూరగాయలు!

అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించినప్పటికీ, ఆ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంపొందించేందుకు వాషింగ్టన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

crime news: ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం.. మేనత్తపై దాడి, తండ్రిని చంపిన నిందితుడు! ఎందుకో తెలిస్తే షాక్..

ఆగస్టు 7 నుంచి అమెరికా కొంత భారతీయ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సుంకాలు భారత ఎగుమతుల సుమారుగా 55 శాతం విలువపై ప్రభావం చూపుతాయని అంచనా. ఆగస్టు 27 నుంచి మరికొన్ని వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలపై ఇంకా సుంకాలు విధించలేదని స్పష్టం చేశారు.

Asha Workers: ఏపీ ఆశా వర్కర్లకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక…! మూడు బంగారు బహుమతులు…!

జితిన్ ప్రసాద మాట్లాడుతూ, అమెరికా సుంకాలు ముఖ్యంగా టెక్స్టైల్ రంగంపై ప్రభావం చూపవచ్చని, అయితే ఉత్పత్తి నాణ్యత, డిమాండ్, ఒప్పందాలు వంటి అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని హామీ ఇచ్చారు.

Tirumala New Rule: తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త రూల్.. ఆగస్టు 15 నుంచి అది తప్పనిసరి! లేకుంటే నో ఎంట్రీ..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సుంకా నిర్ణయాలను భారత ప్రభుత్వం "అన్యాయమైనవి, అహేతుకమైనవి" అని అభివర్ణించింది. భారతదేశ ప్రజల ఇంధన భద్రత దృష్టిలో ఉంచుకొని మాత్రమే దిగుమతులు ఉంటాయని, ఇతర దేశాలు కూడా జాతీయ ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కేవలం భారత్‌పై మాత్రమే సుంకాలు విధించడం దురదృష్టకరమని ప్రకటించింది.

Chess: 10 ఏళ్ల బాలిక చరిత్ర సృష్టించింది.. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు!

భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు 2025 మార్చిలో ప్రారంభమై ఐదు విడతల చర్చలు జరిగాయి. చివరిసారి జూలై 14-18 తేదీల్లో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు.

Womens: ఏపీ మహిళలకు బంపర్ ఆఫర్…! 80% రాయితీతో వ్యవసాయ డ్రోన్లు!
Temples: ప్రసాదం ఇకపై అరిటాకులోనే..! దేవాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం!
New pattadar books: ఆగస్టు 15 నుంచి కొత్త పట్టాదారు పుస్తకాల పంపిణీ.. రైతులకు శుభవార్త!
Justice Yashwant Varma: చరిత్రలో మూడోసారి... అలహాబాద్ హైకోర్టు జడ్జి! లోక్‌సభ సంచలన నిర్ణయం!
Haj Pilgrims: ఏపీలో హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.1 లక్ష సాయం..!