ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల కవచంతో మరింత శుభ్రతకు దారితీస్తోంది. చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని స్వచ్ఛత పరంగా మార్చడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతకు కృషి చేసిన వారిని గుర్తించి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ఇవ్వనుంది.
ఈ నెల 6వ తేదీన విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రస్థాయి మరియు జిల్లా స్థాయిలో మొత్తం 69 రాష్ట్ర స్థాయి అవార్డులు, 1,257 జిల్లా స్థాయి అవార్డులు ఈ సందర్భంలో అందించబోతున్నాయి. ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించడం జరిగినది.
వివిధ కేటగిరీలో గుర్తింపు పొందినవారు
స్వచ్ఛతలో అద్భుత ప్రతిభ చూపిన మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు, స్కూల్స్, ఆసుపత్రులు, కార్యాలయాలు, బజార్లు, బస్సు స్టేషన్లు, పరిశ్రమలకి ప్రత్యేక గుర్తింపు కల్పించడం జరిగింది. రాష్ట్రస్థాయిలో 6 మున్సిపాలిటీలను ఎంపిక చేశారు: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు (నెల్లూరు జిల్లా), కుప్పం.
గ్రామ పంచాయతీలలో చౌడువాడ (అనకాపల్లి), ఆర్.ఎల్.పురం (ప్రకాశం), లోల్ల (కోనసీమ), చల్లపల్లి (కృష్ణా), చెన్నూరు (వైఎస్సార్ కడప), కనమకుల పల్లె (చిత్తూరు) ఎంపికయ్యాయి.
అవార్డులు పొందినవారిలో పారిశుద్ధ్య కార్మికులు గ్రీన్ అంబాసిడర లు అదేవిధంగా ఇందులో స్వయం సహాయక సంఘాలు సంబంధించిన వారు కూడా ఉన్నారు. ఈ అవార్డులు కేవలం గుర్తింపు మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రతి ఒక్కరిని ప్రేరేపించే విధంగా ఉండాలని సూచించారు.