ఉత్తర భారతదేశంలో ఈ రోజు కర్వా చౌత్ పండుగను ఎంతో భక్తి, ఆనందాలతో జరుపుకుంటున్నారు. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉండే ఈ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. తెల్లవారుజాము నుంచీ చంద్రుడు కనిపించే వరకు ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండి భర్తల క్షేమం కోసం ప్రార్థిస్తారు. ఈ రోజు భార్యాభర్తల మధ్య ప్రేమ, విశ్వాసం, బంధం మరింత బలపడే రోజు అని నమ్మకం.
పురాణాల ప్రకారంకర్వా చౌత్ పండుగకు రెండు ప్రసిద్ధ కథలు ఉన్నాయి. ఒకటి సావిత్రి సత్యవంతుడి కథ. ఆమె తన భర్తను యముడి నుండి రక్షించడానికి కఠినమైన ఉపవాసం చేసి ప్రార్థించిందని చెబుతారు. మరో కథ ప్రకారం ఒక బ్రాహ్మణుడి కుమార్తె వీరావతి తన భర్త మరణం తర్వాత కర్వా చౌత్ ఉపవాసం చేసి అతన్ని తిరిగి పొందిందని చెబుతారు. ఈ కథలు మహిళల భక్తి, ప్రేమ, త్యాగాన్ని తెలియజేస్తాయి.
ఈ రోజు మహిళలు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆభరణాలతో అలంకరించుకుంటారు.
అత్తగారు ఇచ్చే సర్గి అనే ఆహారం తీసుకున్న తర్వాత ఉపవాసం ప్రారంభిస్తారు.
రోజు మొత్తం ఆహారం నీరు లేకుండా దేవుడి పూజలు చేస్తారు. సాయంత్రం సమయంలో ఇతర మహిళలతో కలిసి పూజలు నిర్వహించి కర్వా అనే మట్టి కుండతో ప్రత్యేక పూజ చేస్తారు.
చంద్రుడు కనిపించిన తర్వాత మహిళలు చంద్రుణ్ణి చూసి తరువాత తమ భర్త ముఖాన్ని చూసి ప్రార్థిస్తారు. భర్తల దీర్ఘాయుష్షు ఆరోగ్యం కోసం దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు. ఆ తర్వాత భర్త చేత నీరు తాగి ఉపవాసం ముగిస్తారు. ఈ పండుగలోని సంప్రదాయాలు భావాలు భార్యాభర్తల మధ్య ప్రేమను మరింత బలపరుస్తాయి.
ఇలా కర్వా చౌత్ పండుగ భక్తి ప్రేమ విశ్వాసం కలయికగా నిలుస్తుంది. మహిళలు భర్తల క్షేమం కోసం చేసే ఈ త్యాగం వారి ఆత్మవిశ్వాసం భక్తిని ప్రతిబింబిస్తుంది. కాలం మారుతున్నా ఈ పండుగ భావం మాత్రం మారడం లేదు. భక్తి, ప్రేమ కుటుంబ బంధానికి ప్రతీకగా కర్వా చౌత్ పండుగ ప్రతి సంవత్సరం అదే ఉత్సాహంతో కొనసాగుతోంది.
కర్వా చౌత్ ఉత్తర భారతదేశంలో వరలక్ష్మి వ్రత దక్షిణంలో జరుపుకుంటారు ఇరువురిలోనూ భర్తల దీర్ఘాయుష్షు, శ్రేయస్సు కోసం భార్యలు భక్తితో ఉపవాసం చేసి, పూజలు చేస్తారు, కానీ పద్ధతులు, ప్రాంతం మాత్రమే భిన్నం.