రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గం ఉపసభా సమావేశం రిషికొండ ప్యాలెస్ వినియోగంపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ భవనం ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం దీన్ని ఉపయోగంలోకి తీసుకుని ప్రజలకు, ప్రభుత్వానికి లాభదాయకంగా మార్చే మార్గాలను చర్చించింది. ఈ సమావేశంలో ఉన్నత స్థాయి మంత్రులు పయ్యావుల కేశవ, డీవీబి స్వామి, కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రులు భవనం నిరుపయోగంగా ఉండటం వల్ల ప్రతి నెల ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ చార్జీలు, మెయింటెనెన్స్, సిబ్బంది ఖర్చులు కలిపి సుమారు 20 లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇది ప్రభుత్వానికి భారం అని, భవనాన్ని సక్రమంగా ఉపయోగించడం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చని సూచించారు.
సబ్ కమిటీ భవనాన్ని వినియోగంలోకి తేవడానికి వివిధ మార్గాలను పరిశీలించింది. తక్కువ సమయంలో మార్పులు చేసి, పబ్లిక్ ఈవెంట్లు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వంటి అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే, భవనాన్ని అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయాన్ని పొందే మార్గాలపై కూడా చర్చ జరిగింది.
సభా సభ్యులు ప్రజాభిప్రాయం సేకరించడం ముఖ్యమని నిర్ణయించారు. అందుకే భవన వినియోగంపై ప్రతిపాదనలు, సూచనల కోసం ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను సమీక్షించి భవనాన్ని లాభదాయకంగా ఉపయోగించే మార్గాలను తుది నిర్ణయం తీసుకోవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు అమరావతి రాజధానిగా ఉండటం మాకు అంగీకారమే అని తెలిపిన వైసీపీ పార్టీ వారి ప్రభుత్వంలో రాగానే అమరావతిని కాకుండా విశాఖపట్నం రాజధాని చేయడం కోసం అధిక మొత్తంలో ఈ ప్యాలెస్ నిర్మించడం ద్వారా కొన్ని వేల కోట్లు వృధా పాలయ్యాయని అదే ఖర్చు పోలవరానికి ఉపయోగించుంటే కొన్ని వేలమంది రైతులు ఉపాధిగా రాష్ట్రం అభివృద్ధి వైపుకు వెళ్లేదని మరికొందరికి తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.