లక్షల్లో జీతం.. గల్ఫ్ దేశాల్లో స్థిరమైన ఉద్యోగం.. ఎంఈపీ కోర్సులతో మీ కెరీర్ ప్లాన్ చేసుకోండి! అక్టోబర్ 6 నుండి!

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ విప్లవాత్మకంగా అభివృద్ధి చెందింది. ఈ సాంకేతికతతో ఏది నిజమైన ఫొటో, ఏది ఏఐ ద్వారా క్రియేట్ అయినది అనేది గుర్తించడం కష్టంగా మారింది. హీరోల నుంచి ప్రధాని వరకూ ప్రతి ఒక్కరినీ ఏఐ ఆధారంగా మార్ఫ్ చేసి వీడియోలు, ఫొటోలు సృష్టించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. సరదాగా, వినోదం కోసం ఉపయోగిస్తే సరిపోతుంది. కానీ ఈ విధమైన ఏఐ కంటెంట్ కొన్ని సార్లు ఫేక్ న్యూస్‌ను సృష్టించడానికి వేదిక అవుతుంది. అదేవిధంగా, వ్యక్తిగత గోప్యత (Privacy) కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, భారత ప్రభుత్వం ఏఐ వాడకంపై నియంత్రణలు, నిర్దిష్ట రూల్స్ రూపొందించడానికి ముందుకొచ్చింది.

రానున్న 24 గంటల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు.! సెప్టెంబర్ 26, 27 తేదీలు వరకు కీలకం! ఈ 7 జిల్లాలకు..

భారత ప్రభుత్వం ఏఐ కంటెంట్ క్రియేటర్లపై నియంత్రణలను అమలు చేయడానికి కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. లోక్‌సభ స్పీకర్‌ కు సమర్పించిన ముసాయిదా నివేదికలో, ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలను సృష్టించిన వ్యక్తులు లేదా కంపెనీలను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచన ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో వ్యాప్తి చెందే ఫేక్ వార్తలు, ఫేక్ వీడియోలను అడ్డుకోవడానికి ఈ నియంత్రణలు కీలకం అవుతాయి.

AP Metro Rail Renders: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! జాయింట్ వెంచర్లకు అవకాశం! అక్టోబర్ 10 వరకు..

ఈ కొత్త నియమావళి ప్రకారం, ఏఐ ఆధారిత కంటెంట్ క్రియేట్ చేసేవారికి లైసెన్సులు అవసరం అవుతాయి. కానీ ఈ లైసెన్స్ వ్యక్తిగతులకు కాకుండా, ఏఐ టూల్స్ వాడి తయారైన కంటెంట్‌కు మాత్రమే వర్తించనుంది. ఈ విధంగా సృష్టించబడిన కంటెంట్‌పై ఒక ప్రత్యేక లేబుల్ లేదా గుర్తింపు ఉంటుంది, తద్వారా ప్రేక్షకులు ఆ కంటెంట్ ఏఐ ద్వారా ఉత్పత్తి అయ్యిందా లేదా అసలు కంటెంట్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ప్రజలకు ఫేక్ కంటెంట్‌ను గమనించడానికి సహాయం కలుగుతుంది.

Dussehra celebrations : దసరా ఉత్సవాల్లో హోం మంత్రి అనిత.. రాష్ట్రంపై సైకోల కళ్ళు పడకూడదని దుర్గమ్మను వేడుకున్నా!

ప్రస్తుతం ఈ రూల్ చర్చల దశలో ఉంది, కానీ ప్రభుత్వం అంగీకారం తెలిపితే త్వరలో అమలులోకి వస్తుంది. ఏఐ కంటెంట్ పై లైసెన్సింగ్ విధానం వల్ల ఎలాంటి నష్టాలు తగలవు, కేవలం వినియోగదారులు ఏది ఫేక్, ఏది ఒరిజినల్ అనేది తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీని ద్వారా సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోల వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వానికి మార్గం తేలుతుంది. అంటే వినియోగదారులు, కంటెంట్ క్రియేటర్లు రెండూ సురక్షితంగా ఉండేలా, ఏఐ ఆధారిత సమాచారం సక్రమంగా ఉపయోగించడానికి ఇది దోహదపడుతుంది.

ఒక రాత్రిలో లక్షాధికారిగా మారాలంటే.. ఈ వాగు దగ్గరకు రండి! ఇదే అసలైన వజ్రాల వేట - ఎక్కడంటే.!
GST: కార్ కొనేవారికి గుడ్ న్యూస్..! కొత్త జీయస్టీ విధానం.. వాటిపై భారీ డిస్కౌంట్..!
World Class state Library: ఏపీలో కొత్తగా వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ! రూ.150 కోట్లతో అక్కడే ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!
India Pakistan: ఆసియా కప్ ఫైనల్లో మూడోసారి భారత్-పాక్ తలపడే అవకాశం.. ఫర్హాన్ హాఫ్ సెంచరీ తర్వాత గన్ ఫైరింగ్!
Washington: మూడు నాలుగు రోజుల్లోనే భారతీయ కుటుంబాలు అల్లకల్లోలం! ట్రంప్ నిర్ణయం.. విద్యార్థుల్లో నిరాశ!
Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు! దీపావళి నాటికి 10 గ్రా ₹ 1.25 లక్షలకు! నిపుణుల సూచనలు!