Indian Railway: భారత రైల్వేలో ఈ ఒక్క ట్రైన్‌లో మాత్రమే... టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ ఫ్రీ!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షం ఎక్కువగా పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వర్షాల కారణంగా నదులు, కాలువలలో నీటి ప్రవాహం  పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది, చిన్న చెరువులు సైతం వరదనీటితో నిండిపోతున్నాయి.

భారత్ చమురు కొనుగోలు ఆపలేరు... ట్రంప్‌కు పుతిన్ ఇండైరెక్ట్ వార్నింగ్!!!

పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో జిల్లా అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రజలు, విద్యార్థులు, రోడ్లపై లేదా నదుల దగ్గరగా వెళ్లకూడదు అని హెచ్చరిస్తున్నారు. ప్రజల భద్రత కోసం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బంది, బోట్లు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు.

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఈ రూట్లలో 26 ప్రత్యేక రైళ్లు!

వర్షాలు అధికమవుతున్న కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించబడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట, జిలుమూరు, ఆముదాలవలస, పోలాకి, కోటూరు, హీరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు నేడు సెలవు ప్రకటించింది. జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Vijayawada Ustav: గిన్నిస్ రికార్డుతో ప్రపంచ పటంలో నిలిచిన విజయవాడ ఉత్సవ్ 2025!

ప్రభుత్వం, జిల్లా అధికారులు పరిస్థితిని నేరుగా పర్యవేక్షిస్తూ అవసరమైతే మరిన్ని రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రజల భద్రత మొదటి ప్రాధాన్యత అని అధికారులు సూచిస్తున్నారు.

VMRDA Projects: ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.174 కోట్లతో వీఎంఆర్డీఏ ఏడు రహదారుల నిర్మాణం!
Bhagavad Gita: ఓం పరమ పవిత్రాయై నమః.. జ్ఞానం కన్నా పవిత్రం మరొకటి లేదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -21!