ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?
Thu May 08, 2025 08:45 Politics
బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్ ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం మద్దతిస్తుందని ఆయన అన్నారు.
తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి..
యువగళం పాదయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని. గత ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా.. బెదరకుండా ఎదరు నిలిచిన పోరాడిన అంజిరెడ్డి, జులారెడ్డి, తోట చంద్రయ్య వంటి వారే తనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ అన్నారు.
10 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం..
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 10 నెలల పాలనలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెన్షన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్, వికలాంగులకు రూ.6వేలు పెన్షన్, ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి రూ.15వేలు పెన్షన్ ఇవ్వడం ఒక్క ఏపీలోనే జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్తరేషన్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని ఆయన అన్నారు. జూన్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. జులలో వాటిని పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు. వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కార్యక్రమాలు అమలుచేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ప్రధాని మన కోరికలు నెరవేరుస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పడిందని.. ప్రధాని మన అన్ని కోరికలు నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. మనం అమరావతి కడుతున్నాం.. మనమే అమరావతి కడుతున్నాం అని మొన్నటి సభలో ప్రధాని వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు పవన్ కృషిచేస్తున్నారని తెలిపారు. మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఆయనకు అండగా నిలిచేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు గుడ్న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!
గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!
అంగన్వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!
'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #TallikiVandanam #AndhraPradesh #TDPUpdates #LokeshAnnouncement #GoodNews #APWelfare #AnnadataSukhibhava
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.