Kadapa Jail: కడప జీవితఖైదీకి గోల్డ్ మెడల్! 4 డిగ్రీలు, 3 పీజీలు పూర్తి చేసిన యుగంధర్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆదాయం, నివాసం, కులం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇప్పటి వరకు ఈ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో అవినీతి, ఆలస్యం, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ‘వాట్సాప్ గవర్నెన్స్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ప్రజలకు ఈ పత్రాలను నేరుగా ఇంటికే అందిస్తామని ఆర్టీజీఎస్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ప్రకటించారు.

Farmers: పత్తి రైతులకు గుడ్ న్యూస్! ఏపీలో CCI మద్దతు ధరకు పత్తి కొనుగోలు..!

ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ శాఖ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ఇకపై పౌరులను ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దారు కార్యాలయాలకు పిలవొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం ఇప్పటికే ఆర్టీజీఎస్ వద్ద ఉన్నందున, ఆ ఆధారంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌తో పాటు ఇతర పత్రాలను జారీ చేయాలని ఆదేశించారు. పుట్టుకతో వచ్చిన కులం మారదనే కారణంతో క్యాస్ట్ సర్టిఫికెట్‌ను సులభంగా ఇవ్వవచ్చని, ఆదాయ ధ్రువీకరణకు కూడా ఇదే విధానం వర్తిస్తుందని ఆయన అన్నారు.

100Percent Tariff: భారత్ పై ట్రంప్ మరో పిడుగు.. వాటిపై 100% టారిఫ్! అక్టోబర్ 1 నుంచి అమలు!

ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి ఒకసారి సర్వే పూర్తి చేసింది. అక్టోబరులో మరోసారి సర్వే నిర్వహించి ఆదాయం, కులం వంటి పత్రాలకు అవసరమైన సమాచారం ఆర్టీజీఎస్‌కు అందజేస్తుంది. ఈ డేటా ఆధారంగా నవంబరు నుంచి ప్రజలు తమ ధ్రువీకరణ పత్రాలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లభించనుంది. దీంతో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందుతాయి. మునుపటిలా ఆఫీసుల చుట్టూ తిరగడం, మధ్యవర్తుల దందా ఇక అవసరం ఉండదు.

LPG Cylinder: ఇంటింటికి సాయం! LPG ధరలో భారీ తగ్గింపు! ఒక్కొక్క సిలిండర్ పై ఎంతో తెలుసా!

ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లు పొందాలంటే ప్రజలు దరఖాస్తులు చేసుకోవాల్సి వచ్చేది. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన ‘సుమోటో’ విధానం ప్రకారం అధికారులు స్వయంగా అవసరమైన పత్రాలను నమోదు చేసి, ధ్రువీకరణలు జారీ చేస్తారు. మీసేవ సెంటర్‌లో దరఖాస్తు చేస్తే ఒక రోజులోనే పత్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అవినీతి, అక్రమాలను అరికట్టడంలో ఈ విధానం ఎంతో ఉపయోగపడనుంది. జారీ అయిన పత్రాలు ఒకసారి పొందిన తర్వాత మళ్లీ కావాలంటే ఎప్పుడైనా వాట్సాప్ మిత్రా లేదా ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ శాశ్వత సామాజిక ధ్రువపత్రం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

KAPAS Kisan App: ఆ రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ! క్వింటా ధర రూ.8,110గా ఫిక్స్! సులభంగా స్లాట్ బుకింగ్ సదుపాయం!
Job Opportunities: ఈ కోర్సుల్లో చేరితే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు! టెన్త్ చదివిన వారికి కూడా... పూర్తి వివరాలివే!
New Medtech Zone: ఏపీలో కొత్తగా మరో మెడ్‌టెక్ జోన్.. ఎయిర్‌పోర్ట్ పక్కనే ఆ జిల్లాలో ఫిక్స్, 140 ఎకరాల భూసేకరణ!
Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
APSDMA: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. రేపటికి వాయుగుండంగా - ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!
25/09 టీడీపీ ప్రజావేదిక పరిష్కారాలు.. వైసీపీ సర్పంచ్ భూ దందా.. రాజకీయ కక్షతో 30 ఏళ్ల సాగు భూమి ఆక్రమణ!