ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) అధ్యక్షతన మంగళవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. సచివాలయం వేదికగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలో మౌలిక వసతుల కోసం అదనంగా భూసమీకరణ చేయాలని నిర్ణయించింది. మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో అమరావతిలో మరోసారి భూసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఒకే రకమైన రూల్స్తో భూసమీకరణ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Amrapali Kata: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి బిగ్ రిలీఫ్ - మళ్లీ తెలంగాణకు షిఫ్ట్!
అలాగే అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్(Upgradation of instructor posts)కు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అలాగే రాష్ట్రంలో మరో 9 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మరోవైపు తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాల భూమిని పర్యాటకశాఖకు బదిలీ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే భవన నిర్మాణ చట్టంలో నిబంధనల సవరణకు ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా స్పోర్ట్స్ కోటా కింద టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరోవైపు టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి కంటే ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు కూడా 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Indian Railways: ఇండియన్ రైల్వే ప్లాన్స్ అదుర్స్ అంతే.. 2 వేల కొత్త రైళ్లు! ప్రయాణీకులందరికీ బెర్తులు..
2016 రియో ఒలింపిక్స్లో పీవీ సింధు సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. భారత త్రివర్ణ పతాకాన్ని విశ్వ క్రీడా సంబరంలో రెపరెపలాడించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇచ్చి గౌరవించారు. గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్ విధుల్లో చేరారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మరోసారి టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: