Land Rules: ఇక ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..! భూమి మార్పిడి ఒక్క క్లిక్‌తో..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు పరిశ్రమను మళ్లీ బలోపేతం చేయడానికి నూతన చర్యలు చేపట్టింది. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ రంగాన్ని తిరిగి చైతన్యవంతం చేయడం కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించింది. ఈ క్రమంలో మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేసే రైతులకు భారీ రాయితీలను ప్రకటించింది. రైతుల ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా ప్రాజెక్ట్‌.. రూ.1.47 లక్షల కోట్లతో శ్రీకారం! ఏ జిల్లాలో అంటే ?

రైతులకు అందించే ఈ రాయితీలు వర్గాల వారీగా విభజించబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం వరకు రాయితీ ఇవ్వగా, ఇతర రైతులకు కూడా గణనీయమైన రాయితీలు మంజూరు చేస్తున్నది. ఉదాహరణకు, మల్బరీ సాగుకు ఒక్క ఎకరాకు రూ.30 వేల ఖర్చు అవుతుందనుకోండి, ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.27 వేల రాయితీ, ఇతర రైతులకు రూ.22,500 రాయితీ లభిస్తుంది. ఇది రైతులపై ఉండే పెట్టుబడి భారం తగ్గించి, మరింత మంది ఈ రంగంలోకి రావడానికి ప్రోత్సహిస్తుంది.

ముఖ్య గమనిక! మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో 28, 29 తేదీలలో కార్యక్రమాలు రద్దు!

పట్టుపురుగుల పెంపకం కోసం షెడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది. షెడ్-1 నిర్మాణానికి యూనిట్ ధర రూ.4.50 లక్షలు కాగా, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.4.05 లక్షలు, ఇతర రైతులకు రూ.3.37 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. షెడ్-2 నిర్మాణానికి కూడా ఇలాంటి రాయితీలు వర్తిస్తాయి. ఈ చర్యలతో రైతులు ఆధునిక పద్ధతుల్లో పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టగలుగుతున్నారు.

Home Minister Anita warns: తుపాన్ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్.. హోంమంత్రి అనిత హెచ్చరిక!

ఇక పట్టు పరిశ్రమకు అవసరమైన పరికరాలు, స్టాండ్లు, వ్యవసాయ యంత్రాలపై కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ఒక్కో స్టాండ్ ధర రూ.45,500 కాగా, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.40,950, ఇతర రైతులకు రూ.34,125 రాయితీ అందుతుంది. వ్యవసాయ యంత్ర పరికరాలపై కూడా రూ.1 లక్ష యూనిట్ ధరలో ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.90 వేలు, ఇతరులకు రూ.50 వేల రాయితీ లభిస్తుంది. ఇది రైతుల ఉత్పత్తి ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.

New Centers: APలో జిల్లాల పునర్విభజన తుది దశలో..! ఆరు కొత్త కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్!

ఈ రాయితీలను పొందాలనుకునే రైతులు సమీప రైతు సేవా కేంద్రం (RSK)లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, సహాయకులు రైతులకు అవసరమైన మార్గదర్శకత అందిస్తారు. పట్టు పరిశ్రమ పునరుద్ధరణతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్నిస్తుంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని మల్బరీ రైతులు కొత్త ఉత్సాహంతో పట్టు సాగును విస్తరించే అవకాశం ఉంది.

IPS officer Sajjanar: IPS అధికారి సజ్జనార్ హెచ్చరిక.. నా పేరుతో వచ్చే మెసేజులు నమ్మొద్దు!
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూములు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి! డిసెంబర్ 6 వరకే ఛాన్స్.. లేదంటే!
AI : కృత్రిమ మేధతో జాగ్రత్త! ఈ 5 విషయాలు ఎప్పుడూ అడగకండి అంటున్న నిపుణులు!!
EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..!
District Reorganization: ఆ నియోజకవర్గాల విలీనంపై ప్రభుత్వం మళ్లీ దృష్టి! కృష్ణా జిల్లాలోకి చేర్చే యోచన!