RTC: ప్రయాణం సురక్షితం అని భరోసా ఇస్తున్న తెలంగాణ ఆర్టీసీ.. ఏసీ పల్లె వెలుగు బస్సుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి!

అమెరికాలో అక్రమ వలసదారులపై మరోసారి భారీ చర్యలు ప్రారంభమయ్యాయి. దేశ చట్టాలను ఉల్లంఘించి నివసిస్తున్న విదేశీయులను గుర్తించి, వారిని స్వదేశాలకు పంపే ప్రక్రియను అమెరికా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా 54 మంది భారతీయులను తిరిగి భారత్‌కు పంపింది.

Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! అక్కడ నెలకు రూ.లక్ష ... 90శాతం రాయితీ!

అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీరిని హర్యానాకు చెందినవారిగా గుర్తించారు. వారిలో కర్నాల్‌ జిల్లాకు 16 మంది, కైథల్‌కు 15 మంది, అంబాలా జిల్లాకు 5 మంది, యమునానగర్‌ మరియు కురుక్షేత్ర జిల్లాలకు 4 మంది చొప్పున ఉన్నారు. జింద్‌ నుంచి 3 మంది, సోనిపట్‌ నుండి 2 మంది, పంచ్‌కుల, పానిపట్‌, రోహ్‌తక్‌, ఫతేహాబాద్ జిల్లాల నుండి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది 25–40 ఏళ్ల మధ్య వయస్సు గలవారని అధికారులు తెలిపారు.

Land Rules: ఇక ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..! భూమి మార్పిడి ఒక్క క్లిక్‌తో..!

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ వ్యక్తులు డంకీ రూట్ గా పిలవబడే అక్రమ మార్గం ద్వారా అమెరికాలోకి చొరబడ్డారు. ఈ మార్గం లాటిన్ అమెరికా దేశాల గుండా అమెరికా భూభాగానికి చేరే ప్రమాదకర రూట్‌గా ప్రసిద్ధి చెందింది. సరైన పత్రాలు లేకపోవడంతో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిర్బంధించి స్వదేశానికి పంపారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా ప్రాజెక్ట్‌.. రూ.1.47 లక్షల కోట్లతో శ్రీకారం! ఏ జిల్లాలో అంటే ?

దేశానికి చేరుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ జరిపారు. అనంతరం వారిని కుటుంబాలకు అప్పగించినట్లు కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ తెలిపారు. అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లడం చాలా ప్రమాదకరం. ఇలాంటి చర్యలు జీవితాంతం ఇబ్బందులకు దారి తీస్తాయి అని ఆయన హెచ్చరించారు.

ముఖ్య గమనిక! మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో 28, 29 తేదీలలో కార్యక్రమాలు రద్దు!

కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ తనిఖీలు మరింత కఠినతరం అయ్యాయి. ఆ ప్రమాదానికి కారణమైన 21 ఏళ్ల జస్మన్‌ప్రీత్ సింగ్ కూడా అక్రమ వలసదారుడేనని అధికారులు తెలిపారు. అతను 2022లో డంకీ రూట్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు విచారణలో తేలింది.

Home Minister Anita warns: తుపాన్ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్.. హోంమంత్రి అనిత హెచ్చరిక!

ఉద్యోగాలు ఆర్థిక స్థిరత్వం కోసం విదేశాలకు వెళ్ళాలన్న కల యువతలో వేగంగా పెరుగుతోంది. కానీ చట్టబద్ధ మార్గాల బదులు అక్రమ మార్గాలను ఎంచుకుంటే ఫలితాలు దారుణంగా మారుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికా, కెనడా, యూరప్ దేశాలు ఇలాంటి అక్రమ వలసదారులపై చర్యలను మరింత కఠినతరం చేశాయి.

New Centers: APలో జిల్లాల పునర్విభజన తుది దశలో..! ఆరు కొత్త కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్!
IPS officer Sajjanar: IPS అధికారి సజ్జనార్ హెచ్చరిక.. నా పేరుతో వచ్చే మెసేజులు నమ్మొద్దు!
Praja Vedika: నేడు (27/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూములు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి! డిసెంబర్ 6 వరకే ఛాన్స్.. లేదంటే!