శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి కలిసి 83,242 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంలోకి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి మొత్తం ఔట్ఫ్లో 98,676 క్యూసెక్కులుగా నమోదైంది.
ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 35,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 28,361 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.90 అడుగులుగా ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 182.21 టీఎంసీలుగా ఉంది. వరద నీటి రాకతో జలాశయం వేగంగా నిండుతున్నట్లు అధికారులు తెలిపారు.