ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
తెలుగువారి ఆత్మగౌరవ పతాక అమరావతి (Amaravati) అని ఎస్సీ కమీషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ అన్నారు. శనివారం (Saturday) ఉదయం ఫిలాంత్రోపిక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డా.అద్దంకి రాజా యోనా ఆధ్వర్యంలో విజయవాడ (Vijayawada) లోని హాటల్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్ లో విభిన్న రంగాలలో విశిష్ట వ్యక్తులను అమరావతి కీర్తి పురస్కారాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్యఅతిధిగా విచ్చేసిన కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ మాట్లాడుతూ ఒకప్పుడు అమరావతి వ్యాపార రాజధానిగా పరిఢవిల్లిందని ఇప్పుడు ఆ వైభవాన్ని తిరిగి ప్రతిష్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) విశేష కృషి చేస్తున్నారన్నారు.
నాటి యశోకీర్తిని రెట్టింపు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యిందని త్వరలో దాని ఫలితాలు చూడబోతున్నాం అన్నారు. అంతటి ఘనకీర్తి గల అమరావతి పేరుతో పురస్కారాలు అందుకోబోతున్న విశిష్ట వ్యక్తులకు జవహర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సభాధ్యక్షులు NRI TDP కో ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగువారి సుదీర్ఘ జీవనయానానికి అమరావతి స్వర్గధామం అన్నారు. ప్రపంచంలో అందరి కళ్ళు అమరావతి వైపే చూస్తున్నాయని అటువంటి అమరావతి పేరుతో ప్రప్రదంగా పురస్కరాలు ఇవ్వడం ముదావహం అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, ఆర్.పి.ఐ. జాతీయ కార్యదర్శి పేర శివ నాగేశ్వరరావు గౌడ్, శ్రీనాధ మహాకవి పదమూడవ తరం వంశీయులు డా.కావూరి శ్రీనివాస్ శర్మ, కవయిత్రి మొల్ల ఎనిమిదో తరం వంశీయులు డా. మున్నెల్లి శివశంకరయ్య, ఎస్సీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష, టి.టి.డి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు డా.మిరియాల వెంకట రమణయ్య, ప్రముఖ సంఘ సేవకుడు చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
అనంతరం వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులకు అమరావతి కీర్తి పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ప్రాచీన కవుల వారసులచే మకుటం, కంకణ ధారణ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Liquor Scam AP: అరెస్ట్ ఎప్పుడు? విజయవాడలో హైటెన్షన్ – సిట్ ముందు మిథున్ రెడ్డి హాజరు!
Anantapur Incident: రెండేళ్ల బిడ్డను పొట్టన పెట్టుకున్న దోస.. అనంతపురంలో విషాద ఘటన!
Prathipati Comments: ఎప్పటికీ దాగలేరూ.. దోచిన దానికి హద్దులు లేవ్! టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు!
Annavaram Temple: అన్నవరం ఆలయంలో షాక్! దేవస్థాన నిబంధనలు ఉల్లంఘన – అర్చకుడు సస్పెండ్!
Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు! వారంలోనే ఇది మూడోసారి!
Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: