తల్లికి వందనం పథకం ([Talli Ki Vandanam Scheme]).. పేద కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలలకు ([schools]) పంపేలా ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ([AP Government]) తీసుకువచ్చిన కార్యక్రమం. ఈ పథకం కింద ఇప్పటికే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.13000 జమ చేసింది. తల్లికి వందనం డబ్బులు అందిన కుటుంబాలు సంబరపడుతుండగా, కొన్ని చోట్ల చిన్న పొరపాట్ల వల్ల లబ్ధి అందని పరిస్థితి ఏర్పడింది.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదివే 300 మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం అందలేదు. తల్లిదండ్రులు సచివాలయాల ([Secretariats]) సిబ్బంది సహాయంతో వినతులు సమర్పించినప్పటికీ, రెండో విడత ([second phase]) డబ్బులు కూడా రాలేదని వాపోతున్నారు.
తల్లుల ఆధార్ నంబర్లు ([Aadhaar numbers]) తప్పుగా నమోదు కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని, 12 అంకెల స్థానంలో 9 అంకెలు నమోదైనట్లు తిక్కవరం హెడ్మాస్టర్ ([Headmaster]) తెలిపారు. సమస్యను పరిష్కరించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నట్లు చెప్పారు.
ఇక మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10000 కోట్లకు పైగా ప్రభుత్వం జమ చేసింది. అర్హులైనవారికి రెండోసారి దరఖాస్తు ([application]) చేసుకునే అవకాశం ఇచ్చి, తాజాగా జాబితాను విడుదల చేసింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.13000 చొప్పున ఇవ్వనున్నారు. అదనంగా రూ.2000 పాఠశాల అభివృద్ధికి వినియోగిస్తారు.