Elections: 20 ఏళ్ల తర్వాత ఏపీలో అక్కడ ఎన్నికలు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

పల్నాడు (Palnadu) జిల్లా సత్తెనపల్లి లో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో వైకాపా నేతలు సతతంగా ఇరుక్కుపోతున్నారు. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి విడదల రజిని (Former Minister Rajini resigns)కి స్థానిక పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెల 18న సత్తెనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నేతలు నిర్వహించిన బల ప్రదర్శన, మోటారు వాహన ర్యాలీ, భారీగా జన సమీకరణ వంటి కార్యక్రమాలు ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయంటూ కేసు నమోదైంది.

Employement: నిరుద్యోగులకు పండగ లాంటి వార్త! ఖాళీగా 1,000 పోస్టులు

ఈ ఘటనలో జన స‌మీకరణ‌కు అనుమతి లేకుండానే సభ నిర్వహించినట్లు, అలాగే ప్రజల ఆస్తుల ధ్వంసం, ట్రాఫిక్‌ (Traffic)కు అంతరాయం కలిగించినట్లు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు, 113 మంది పార్టీ నేతలకు, కార్యకర్తలకు, మద్దతుదారులకు నోటీసులు (Notices) పంపినట్లు సమాచారం. వారిలో ప్రముఖ నేతలైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, గజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే విచారణకు హాజరయ్యారు.

Deepam-2: ముందుగా డబ్బు చెల్లించకుండానే గ్యాస్ సిలిండర్లు... దీపం-2లో కొత్త మార్పులు!

ఈ క్రమంలో, విడదల రజినిని కూడా ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేస్తూ పోలీసులు నోటీసు జారీ చేశారు. విచారణ సందర్భంగా మిగతా నాయకులపైనా పోలీసులు మరిన్ని ప్రశ్నలు వేయవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అనుమతిలేకుండా భారీ బహిరంగ సభలు నిర్వహించడం వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

Nimisha Priya: నిమిష ప్రియ వచ్చేస్తోంది! కేఏ పాల్ సంచలన ప్రకటన!
Amaravati Kirti Awards: తెలుగువారి ఆత్మగౌరవ పతాక అమరావతి.. ఎస్సీ కమీషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్
Trump: అయిదు యుద్ధ విమానాలను కూల్చేశారు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!