Railway Tunnel: ఏపీలో ఆ రెండు జిల్లాలకు మహర్దశ! రూ.470 కోట్లతో అతిపెద్ద రైల్వే టన్నెల్! వారికి పండగే పండగ!

రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, 496 గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలోకి చేర్చే ప్రతిపాదనలు సిద్ధం చేశామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ ప్రతిపాదనల ప్రకారం, 50 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా కలిగిన గ్రామాలను గుర్తించి షెడ్యూల్డ్‌ పరిధిలోకి తీసుకురావాలని సంబంధిత ఐటీడీఏ పీవోలు, జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.

Cholera Cases: గుంటూరులో కలరా కలకలం! నాలుగు కేసులు నిర్ధారణ!

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బండారు సత్యనారాయణమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో 9 గ్రామ పంచాయతీలకు చెందిన 60 గ్రామాల్లో 25 వేలకు పైగా గిరిజనులు నివసిస్తున్నారని చెప్పారు. ఈ గ్రామాలను కూడా ప్రతిపాదనల్లో చేర్చినట్లు తెలిపారు.

Addala Mandapam: తిరుమల తరహాలో అక్కడ కూడా అద్దాల మండపం! కోటి రూపాయల విరాళం ఇచ్చిన దాత!

ఇదిలా ఉంటే, బండారు మాట్లాడుతూ రాష్ట్రంలో 600కు పైగా గిరిజన గ్రామాలు ఇంకా నాన్‌ షెడ్యూల్డ్‌ పరిధిలో ఉన్నాయని, ఫలితంగా ఆ గ్రామాలకు తగిన అభివృద్ధి అవకాశాలు దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, తన నియోజకవర్గంలోని 138 గిరిజన కాలనీలను షెడ్యూల్డ్‌ ఏరియాలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. యానాదుల కార్పొరేషన్‌ ఏర్పాటు హామీని నెరవేర్చాలని కూడా కోరారు.

H1b Visa: హెచ్1బీ వీసాలపై భారీ నిర్ణయం.. అమెరికా కంపెనీలకు మోయలేని భారం! అమెరికన్లకే ఉద్యోగాలు..

అలాగే, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూడా తమ నియోజకవర్గంలోని 58 గ్రామాలను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఇతర ప్రజాప్రతినిధులు కూడా గిరిజన గ్రామాల సమస్యలు, అభివృద్ధి లోపాలను ప్రస్తావించారు.

Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!

ఇక, ఇతర ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రోడ్ల పక్కన విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను పూర్తిగా నరికి వేయడం లేదని, కేవలం కొమ్మలను మాత్రమే కత్తిరిస్తున్నామని తెలిపారు. అలాగే, ఇబ్రహీంపట్నం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుంచి వస్తున్న ఫ్లైయాష్‌ వల్ల కలిగే కాలుష్యంపై ప్రశ్నించగా, ఏపీ జెన్‌కో కాలుష్య నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిందని చెప్పారు.

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు వర్షాల ఎఫెక్ట్! చెరువులా మారిన రోడ్లు.. గంటల కొద్దీ ఎదురుచూపులు!
BYD U9 xtreme: ఆటోమొబైల్ రంగంలో కొత్త చరిత్ర.. BYD U9 ఎక్స్‌ట్రీమ్ సెన్సేషన్!
Chandrababu Speech: జీఎస్టీ 2.0తో రాష్ట్ర ప్రజలకు రూ.8,000 కోట్లు ఆదా.. 65 వేలకు పైగా - తగ్గిన ధరలతో ఆనందంగా.!
H-1B Crisis: మస్క్ ట్వీట్ మళ్లీ వైరల్..! వలసదారుల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ..!
APCO Offers: దసరా, దీపావళి పండగ బంపరాఫర్.. చేనేత వస్త్రాలపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్.!