అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన దుండగుడిని ఎఫ్బీఐ గుర్తించింది. ఫైరింగ్ చేసిన షూటర్ ను 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్ గా అధికారులు గుర్తించారు. థామస్ మాథ్యూ క్రూక్స్ పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్కు చెందిన వ్యక్తని వెల్లడించారు. ఏఆర్ 15 సెమీ ఆటోమేటిక్ గన్ తో కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. క్రూక్ దగ్గర ఎలాంటి ఐడీ కార్డులు లేకపోవడంతో డీఎన్ఏ, బయోమెట్రిక్ ద్వారా నిందితుడి ఆధారాల నిర్ధారణకు అధికారులు యత్నిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాగా, ఆదివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ నగరంలో ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో నిందితుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బుల్లెట్ ట్రంప్ చెవికి తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన అమెరికా సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్స్ ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడిని స్పాట్లోనే కాల్చి చంపారు. తాజాగా నిందితుడిని థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించారు. అమెరికా అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్న ట్రంప్ పై కాల్పులు జరగడంతో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇవి కూడా చదవండి:
ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
ఈ దేశాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!
రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ!
నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: