NITI Aayog: నీతి అయోగ్ కీలక నివేదిక విడుదల.. కేర్గివర్స్ సాధికారతకు కొత్త వ్యూహాలు, వికసిత్ భారత్-2047 లక్ష్యంగా కార్యాచరణ!
NITI Aayog: దేశంలో కేర్గివర్స్ (సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు) పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు, సమగ్ర సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నీతి అయోగ్ (NITI Aayog) కీలక నివేదికను విడుదల చేసింది. "రీ ఇమాజినింగ్ కేర్: స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్గివర్స్ ఇన్ వికసిత్ భారత్@2047" పేరుతో విడుదలైన ఈ నివేదిక, అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో కేర్గివింగ్ వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించింది.
కేర్గివర్స్ సాధికారతకు నీతి అయోగ్ కీలక నివేదిక.. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా కొత్త వ్యూహాలు..
చికిత్స కంటే సంరక్షణ గొప్పది.. నీతి అయోగ్ నివేదికలో కీలక వ్యాఖ్యలు..
దేశంలో కేర్గివర్స్ (సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు) పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు, సమగ్ర సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నీతి అయోగ్ (NITI Aayog) కీలక నివేదికను విడుదల చేసింది. "రీ ఇమాజినింగ్ కేర్: స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్గివర్స్ ఇన్ వికసిత్ భారత్@2047" (Reimagining Care: Strategies for Empowering Caregivers in Viksit Bharat@2047) పేరుతో విడుదలైన ఈ నివేదిక, అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో కేర్గివింగ్ వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించింది.
సమగ్ర కేర్గివింగ్ వ్యవస్థపై దృష్టి
ఈ నివేదికలో సమగ్ర కేర్గివింగ్ ఎకోసిస్టమ్ను దేశ సమగ్ర అభివృద్ధి, సామాజిక సంక్షేమానికి కీలక స్తంభంగా పేర్కొన్నారు. అదే సమయంలో నైపుణ్యం కలిగిన కేర్గివింగ్ నిపుణులను తయారు చేసి, ఈ రంగంలో భారత్ను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కార్యాచరణను ప్రతిపాదించింది.
కుటుంబాలు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక సంరక్షణ అవసరమైన వారికి మెరుగైన సేవలు అందేలా విధానాలు రూపొందించాల్సిన అవసరాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది.
వైద్య చికిత్స మాత్రమే కాదు.. సంరక్షణ మరింత విస్తృతం
నివేదిక విడుదల సందర్భంగా నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, దేశ దీర్ఘకాలిక అభివృద్ధి, సామాజిక ఐక్యతకు అత్యంత కీలకమైన అంశంపై నీతి అయోగ్ దృష్టి సారించిందన్నారు.
"ఈ నివేదిక ప్రధానంగా కేర్గివింగ్ అంశంపై దృష్టి పెట్టింది. ఇది కేవలం వైద్య చికిత్సకు మాత్రమే పరిమితం కాదు. సంరక్షణ అనేది చికిత్స కంటే చాలా విస్తృతమైన భావన" అని ఆయన వివరించారు.
ఉన్నతాధికారుల సమక్షంలో నివేదిక విడుదల
ఈ నివేదికను నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్. బాల సుబ్రహ్మణ్యం, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (CEO) నిధి చిబ్బర్ సంయుక్తంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వారిలో ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునిసెఫ్ (UNICEF), ప్రపంచ బ్యాంక్ (World Bank), యూఎన్ ఉమెన్ (UN Women), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), కేర్గివర్ రంగానికి చెందిన ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొని నివేదికపై చర్చించారు.
వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు దిశానిర్దేశం
"రీ ఇమాజినింగ్ కేర్: స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్గివర్స్ ఇన్ వికసిత్ భారత్@2047" నివేదిక ద్వారా దేశంలో కేర్గివర్స్కు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, సామాజిక భద్రత, సమగ్ర సంరక్షణ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి సారించారు.
అభివృద్ధి చెందిన భారత్-2047 లక్ష్య సాధనలో కేర్గివర్స్ పాత్రను మరింత బలోపేతం చేయడం, ఈ రంగంలో అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునేలా భారత మానవ వనరులను సిద్ధం చేయడం ఈ నివేదిక ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.
Be the first to react
