Earthquake: ఒంగోలులో భూప్రకంపనలు: ఆందోళనలో ప్రజలు! Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం ఉగ్రరూపం... ముగ్గురి మృతి! 4 కిలోమీటర్ల పరిధిలో.. Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్... మరో రెండు రోజుల పిడుగులతో కూడిన భారీ వర్షాలు! Rain Alert: వాతావరణ శాఖ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు! మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి! Weather: దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. పలు ప్రాంతాలకు ఐఎమ్‌డీ అలర్ట్! Rain Alert: ఏపీకి వరుణుడి గండం: నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. పిడుగుల హెచ్చరిక! Rain Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్: వచ్చే ఐదు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన! Money Plant: మనీ ప్లాంట్ పెంచుతున్నారా... ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Full rains: గంట వాన.. 50 చెట్లు నేలమట్టం! బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి.. Earthquake: ఒంగోలులో భూప్రకంపనలు: ఆందోళనలో ప్రజలు! Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం ఉగ్రరూపం... ముగ్గురి మృతి! 4 కిలోమీటర్ల పరిధిలో.. Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్... మరో రెండు రోజుల పిడుగులతో కూడిన భారీ వర్షాలు! Rain Alert: వాతావరణ శాఖ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు! మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి! Weather: దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. పలు ప్రాంతాలకు ఐఎమ్‌డీ అలర్ట్! Rain Alert: ఏపీకి వరుణుడి గండం: నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. పిడుగుల హెచ్చరిక! Rain Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్: వచ్చే ఐదు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన! Money Plant: మనీ ప్లాంట్ పెంచుతున్నారా... ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Full rains: గంట వాన.. 50 చెట్లు నేలమట్టం! బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి..

Weather: కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన భారీ వర్షాల సూచన.. ప్రజలకు హెచ్చరికలు జారీ!

Weather: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కొద్ది రోజులు వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Published : 2026-05-10 18:17:00

బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర  తీరప్రాంతం వరకు ద్రోణి..

కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు పిడుగులతో  కూడిన వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కొద్ది రోజులు వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

అలాగే శ్రీలంక ప్రాంతాల వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. ఈ రెండు వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.

కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని కోరింది. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడకూడదని హెచ్చరించింది.

రైతులు వ్యవసాయ పనుల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం, పిడుగులు పడుతున్న సమయంలో రైతులు, పశు కాపరులు చెట్ల కిందకు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.

Spotlight

Read More →