Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Swatch Andhra: గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి! Kollu Ravindra: స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రలో ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి కొల్లు రవీంద్ర! Weather Forecast: 21 ఏళ్ల అంచనాల చరిత్ర: ఈసారి కూడా ముందస్తుగానే దేశంలోకి రుతుపవనాల ప్రవేశం! Andaman: ఎల్లుండి అండమాన్ కు నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ నివేదిక! రాబోయే 48 గంటల్లో.. Weather: అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు.. మరోవైపు వడగాలుల హెచ్చరిక! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Swatch Andhra: గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి! Kollu Ravindra: స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రలో ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి కొల్లు రవీంద్ర! Weather Forecast: 21 ఏళ్ల అంచనాల చరిత్ర: ఈసారి కూడా ముందస్తుగానే దేశంలోకి రుతుపవనాల ప్రవేశం! Andaman: ఎల్లుండి అండమాన్ కు నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ నివేదిక! రాబోయే 48 గంటల్లో.. Weather: అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు.. మరోవైపు వడగాలుల హెచ్చరిక!

Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 2026-05-19 16:12:00

వడగాలులతో ఢిల్లీ వణుకు.. ఐఎండీ హెచ్చరికలు..

దేశ రాజధానిపై ఎండల ఎఫెక్ట్.. వడగాలులపై ఎల్లో అలర్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వచ్చే మూడు రోజుల పాటు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులు కొనసాగనున్నాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందని తెలిపింది.

ఐఎండీ అంచనాల ప్రకారం, ఇవాళ ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండొచ్చని పేర్కొంది. గత 24 గంటల్లో కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల వద్ద కొనసాగడంతో ప్రజలకు ఉపశమనం లేకుండా పోయింది.

ఢిల్లీ రిడ్జ్ ప్రాంతంలోని ఐఎండీ కేంద్రంలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్‌జంగ్ కేంద్రంలో 43.4 డిగ్రీలు, లోధీ రోడ్ కేంద్రంలో 43.8 డిగ్రీలు, పాలం ప్రాంతంలో 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండలు, వేడిగాలులతో రహదారులు వెలవెలబోతున్నాయి.

వైద్య నిపుణులు ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

Spotlight

Read More →