TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్..

కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం!

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కాశీబుగ్గ విషాద ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు కాశీబుగ్గ విజయ వెంకటేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చా

Published : 2025-11-01 13:50:00
Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హై రిస్క్ అలర్ట్..! వ్యక్తిగత డేటా దొంగిలించే ప్రమాదం..!

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కాశీబుగ్గ విషాద ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు కాశీబుగ్గ విజయ వెంకటేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చారు. అయితే భక్తుల రద్దీ అధికమవడంతో ఆలయంలో తోపులాట చోటుచేసుకుని, తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది మహిళలే ఉన్నారని సమాచారం. ఆలయంలో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఈ విషాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Arcelor Mittal Plant: ఏపీలో అతిపెద్ద ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ప్లాంట్! రూ.1.5 లక్షల కోట్లతో.. అక్కడే ఫిక్స్!

ఘటన అనంతరం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. స్పృహ తప్పి పడిపోయిన ఐదుగురు భక్తులను వెంటనే కాశీబుగ్గ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా అంబులెన్స్‌లను తెప్పించి సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఆలయ పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..భూముల యాజమాన్య హక్కులను స్పష్టంగా నిర్ధారించడానికి ఆ పథకాన్ని వేగవంతంగా చేసిన కూటమి ప్రభుత్వం!!

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక X లో స్పందిస్తూ, "కాశీబుగ్గ ఘటన మనసును కలచివేసింది. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాను" అని పేర్కొన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వంగా అన్ని రకాల సహాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..!

ఐటీ మరియు పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. “ఏకాదశి రోజు ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం తీవ్ర బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించాను” అని పేర్కొన్నారు. అలాగే ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీషలతో మాట్లాడినట్లు తెలిపారు.

Bihar election: బీహార్ వస్తే చంపేస్తాం రేసుగుర్రం విలన్ కు వార్నింగ్ ఇస్తున్న గోరఖ్‌పూర్ నివాసి!!

హోంమంత్రి వంగలపూడి అనిత కూడా వెంటనే స్పందించారు. ఆమె జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గాయపడినవారికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

Penugonda Renamed: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పెనుగొండకు కొత్త పేరు!

మంత్రి అచ్చెన్నాయుడు కూడా సంఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన స్వయంగా ఘటనాస్థలికి బయల్దేరారు. ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు అదనపు పోలీసు బలగాలను నియమించారు.

Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!!

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఘటనపై స్పందించారు. ఆయన ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే భద్రతా చర్యల్లో లోపాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు.

Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్!

కాశీబుగ్గ ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పండా నిర్మించిన ఈ ఆలయం ఇటీవలే భక్తులకు తెరవబడింది. 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి శనివారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఏకాదశి సందర్భంగా రద్దీ ఎక్కువ కావడంతో ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన భక్తుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించగా, ప్రభుత్వం మరియు ప్రజలు బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నారు.

Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..!
ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం!
దేశీయ మార్కెట్లో దూసుకెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌! 2026 నాటికి మరికొన్ని కొత్త సర్వీసులు!
Gold Rates: ఎగబాకుతున్న బంగారం ధరలు! పెట్టుబడిదారులలో పెరిగిన ఉత్సాహం!
Lifestyle: తాగుబోతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో.. నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే?

Spotlight

Read More →