Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!!

Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్!

Road Safety: ఏప్రిల్ 15, 2026 నుండి జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు కొత్త జరిమానాలు అమలు కానున్నాయి. 10% వరకు మినహాయింపు ఉండగా, అంతకు మించితే 2 నుండి 4 రెట్లు టోల్ ఫీజును జరిమానాగా ఫాస్టాగ్ ద్వారా వసూలు చేస్తారు. ఉల్లంఘనల వివరాలను వాహన్ పోర్టల్‌లో కూడా నమోదు చేస్తారు.

Published : 2026-04-14 20:02:00

నేషనల్ హైవేలపై కొత్త నిబంధనలు…

టోల్ ప్లాజాల వద్ద 'వే-ఇన్-మోషన్' యంత్రాలు…

ట్రాన్స్‌పోర్ట్ రంగంలో కీలక మార్పులు…

Road Safety: జాతీయ రహదారుల భద్రతను మెరుగుపరచడం మరియు రోడ్లు త్వరగా దెబ్బతినకుండా కాపాడటమే లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను ప్రకటించింది. 'జాతీయ రహదారుల రుసుము నాలుగో సవరణ నిబంధనలు-2026' పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు ఏప్రిల్ 15, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. పరిమితికి మించి బరువు మోసే వాహనాలపై ఉక్కుపాదం మోపుతూ, భారీ జరిమానాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త నిబంధనల ప్రకారం, వాహనాలకు కొంత మేరకు వెసులుబాటు కల్పించారు. నిర్దేశిత బరువు (Gross Vehicle Weight) కంటే 10 శాతం వరకు అదనపు బరువు ఉంటే ఎటువంటి జరిమానా విధించరు. అయితే, అదనపు బరువు 10 శాతం నుంచి 40 శాతం మధ్యలో ఉంటే, ఆ వాహనానికి టోల్ ప్లాజా వద్ద వసూలు చేసే సాధారణ రేటు కంటే రెండు రెట్లు (Double) జరిమానా విధిస్తారు. ఒకవేళ బరువు 40 శాతానికి మించి ఉంటే, ఏకంగా నాలుగు రెట్లు (4 Times) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా అమలు చేసేందుకు సాంకేతికతను వాడుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన 'వే-ఇన్-మోషన్' (WIM) యంత్రాల ద్వారా వాహనం కదులుతుండగానే బరువును లెక్కిస్తారు. ఈ జరిమానా మొత్తాన్ని కేవలం ఫాస్టాగ్ (FASTag) ద్వారా మాత్రమే వసూలు చేస్తారు. నగదు చెల్లింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. ఒకవేళ ఏ టోల్ ప్లాజా వద్దనైనా బరువు తూచే యంత్రం లేకపోతే, అక్కడ ఓవర్‌లోడ్ ఫీజు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా, వాటి వివరాలను జాతీయ వాహన రిజిస్టర్ (వాహన్ పోర్టల్)లో నమోదు చేస్తారు. దీనివల్ల ఆ వాహనంపై ఒక శాశ్వత రికార్డు ఉంటుంది, ఇది భవిష్యత్తులో వాహన యజమానులకు ఇతర సేవలు పొందేటప్పుడు ఇబ్బందిగా మారవచ్చు. ఈ కఠిన నిబంధనల వల్ల వాహనదారులు పరిమితికి లోబడే సరుకు రవాణా చేస్తారని, తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
 

Spotlight

Read More →