Minister Savitha: కురుబల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు! Norway: భారత్‌కు నీతులు చెప్పడం ఆపండి.. ఆ దేశ ప్రగతిని చూసి నేర్చుకోండి: నార్వే పత్రిక సంచలన వ్యాఖ్యలు! Atchennaidu: ఖరీఫ్ రైతులకు కేంద్రం తీపికబురు.. పంటల మద్దతు ధరల పెంపుతో రైతుల్లో ఆశలు! Cyber Crimes: సైబర్ నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష! హెల్ప్‌లైన్‌కు 9.29 లక్షల ఫిర్యాదులు! Prajavedhika: వైసీపీ నేతల దౌర్జన్యం.. నల్లమాడ రైతు ఇంటి కూల్చివేతపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! Chandrababu: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యలపై సీఎం చంద్రబాబు సూచన! Andhra Pradesh: ఏపీ రాజకీయ చరిత్రను మార్చిన రోజు.. వైసీపీ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు! Vijay: వ్యక్తిగత జ్యోతిష్యుడా? ప్రభుత్వ అధికారా? విజయ్ నిర్ణయంపై మండిపడ్డ ప్రేమలత విజయకాంత్! Nara Lokesh: ఉమ్మడి అనంత జిల్లాలో నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఖరారు! Mahanadu: మహానాడు ఏర్పాట్లపై నెల్లూరులో మంత్రుల సమీక్ష! కార్యకర్తలకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి! Minister Savitha: కురుబల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు! Norway: భారత్‌కు నీతులు చెప్పడం ఆపండి.. ఆ దేశ ప్రగతిని చూసి నేర్చుకోండి: నార్వే పత్రిక సంచలన వ్యాఖ్యలు! Atchennaidu: ఖరీఫ్ రైతులకు కేంద్రం తీపికబురు.. పంటల మద్దతు ధరల పెంపుతో రైతుల్లో ఆశలు! Cyber Crimes: సైబర్ నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష! హెల్ప్‌లైన్‌కు 9.29 లక్షల ఫిర్యాదులు! Prajavedhika: వైసీపీ నేతల దౌర్జన్యం.. నల్లమాడ రైతు ఇంటి కూల్చివేతపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! Chandrababu: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యలపై సీఎం చంద్రబాబు సూచన! Andhra Pradesh: ఏపీ రాజకీయ చరిత్రను మార్చిన రోజు.. వైసీపీ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు! Vijay: వ్యక్తిగత జ్యోతిష్యుడా? ప్రభుత్వ అధికారా? విజయ్ నిర్ణయంపై మండిపడ్డ ప్రేమలత విజయకాంత్! Nara Lokesh: ఉమ్మడి అనంత జిల్లాలో నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఖరారు! Mahanadu: మహానాడు ఏర్పాట్లపై నెల్లూరులో మంత్రుల సమీక్ష! కార్యకర్తలకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి!

Prajavedhika: వైసీపీ నేతల దౌర్జన్యం.. నల్లమాడ రైతు ఇంటి కూల్చివేతపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు!

Prajavedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజా వినతుల) కార్యక్రమంలో ప్రజల నుండి భారీగా వినతులు వెల్లువెత్తాయి. ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, రాజకీయ వేధింపులు, రెవెన్యూ రికార్డుల తప్పులు మరియు వ్యక్తిగత సమస్యలపై బాధితులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన నేతలు, సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Published : 2026-05-13 19:10:00

Politics - పట్టా భూమికి 'ఇనాం' ముద్ర - పదేళ్లుగా తిరుగుతున్నా తీరని శ్రీనివాసరావు గోడు.

అన్నదమ్ముల మధ్య భూపోరు: 130 ఎకరాల అక్రమ విక్రయంపై మాణిక్యం వినతి.

రికార్డుల్లో మాయమైన 31 సెంట్లు.. అధికారుల చుట్టూ తిరుగుతున్నా అందని న్యాయం.

Prajavedhika: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా బుధవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం బాధితుల ఆర్తనాదాలతో నిండిపోయింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన ప్రజలు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను నేతలకు విన్నవించుకున్నారు. ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, గత ప్రభుత్వ నేతల వేధింపులు, రెవెన్యూ అధికారుల అలసత్వంపై బాధితులు ఫిర్యాదులు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి అర్జీపై తక్షణమే చర్యలు తీసుకుంటామని నేతలు హామీ ఇచ్చారు.

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడకు చెందిన రవీంద్రనాధ గుప్తా తనపై జరిగిన దౌర్జన్యాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. తన పూర్వీకుల నుండి వచ్చిన సర్వే నంబర్ 270-1 లోని 8.01 ఎకరాల స్థలంలో దశాబ్దాలుగా నివసిస్తున్నానని, అయితే గత మార్చిలో వైసీపీ నేతలు రఘునాధ రెడ్డి, కేశవ రెడ్డి, సోమిరెడ్డిలు జేసీబీలతో వచ్చి తన ఇంటి నిర్మాణాలను అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యను కూడా చూడకుండా దుర్భాషలాడి భయభ్రాంతులకు గురిచేశారని, పునాదులతో సహా నిర్మాణాలను పెకలించి బీభత్సం సృష్టించారని ఆయన వాపోయారు. ఈ అరాచకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పల్నాడు జిల్లా పెదకూరపాడుకు చెందిన శ్రీనివాసరావు తన పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంపై ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 491-1లోని 2.05 ఎకరాల భూమిని తన తాతగారు 1971లోనే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అయితే అధికారులు పొరపాటున దీనిని '22-A' (ఇనాం భూమి) కింద నమోదు చేశారని తెలిపారు. పదేళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, శిస్తు చెల్లిస్తున్నా తమ భూమిపై హక్కులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే తమ భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని విన్నవించారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం డొంకాడ జగన్నాదపురం గ్రామానికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి తన సొంత సోదరులే తనను మోసం చేశారని అర్జీ ఇచ్చారు. తన తండ్రి సింహాచలం పేరు మీద ఉన్న 130 ఎకరాల భూమిని తన సోదరులైన నానేపల్లి ఎరకయ్య, నారాయణ కలిసి తనకు తెలవకుండా ఇతరులకు అక్రమంగా అమ్మేశారని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరగలేదని, తనకు దక్కాల్సిన వారసత్వ ఆస్తిని తిరిగి ఇప్పించాలని ఆయన నేతలను వేడుకున్నారు. అధికారులు కనీసం స్పందించకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన సూర్యారెడ్డి తన తండ్రి మరణానంతరం భూమి పట్టా మార్పిడి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. తన తండ్రి కుడవాల శివరామ రెడ్డి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చుకోవడానికి అవసరమైన మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ పత్రాలన్నీ అందజేసినా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ పట్టా మార్పిడి చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరుకు చెందిన రామకోటేశ్వరరావు తన భూమి విస్తీర్ణం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డుల ప్రకారం తనకు 3.00 ఎకరాల భూమి ఉండాలని, కానీ ఇటీవల అధికారులు చేసిన సర్వేలో కేవలం 2.69 ఎకరాలే ఉన్నట్లు తేలిందని వివరించారు. ఈ 31 సెంట్ల వ్యత్యాసంపై పైఅధికారులకు ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతి లేదని, తమ భూమిని తిరిగి తమకు దక్కేలా చూడాలని ఆయన కోరారు. రికార్డుల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పడమర లక్ష్మీపురానికి చెందిన వెంకటేశ్వర్లు తన ఉమ్మడి ఆస్తి వాటా విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వెల్లడించారు. తన పూర్వీకుల నుండి వచ్చిన 0.82 సెంట్ల భూమిలో తనకు రావాల్సిన ఐదవ వంతు వాటాకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ నుండి కలెక్టర్ వరకు అందరికీ మొరపెట్టుకున్నా కనీసం సమాధానం కూడా రావడం లేదని, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని ఆయన ఆరోపించారు. సామాన్య రైతులకు పట్టా పుస్తకాలు ఇవ్వడంలో అధికారులు చూపుతున్న అలసత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు జిల్లాకు చెందిన వెంకాయమ్మ అనే వృద్ధురాలు తన 4 సెంట్ల భూమిని రికార్డుల్లో నమోదు చేయించుకోవడం కోసం పడుతున్న పాట్లను వివరించారు. సర్వే నంబరు 813-C1లో తనకున్న 97 సెంట్లలో కేవలం 93 సెంట్లు మాత్రమే రికార్డుల్లో ఉందని, మిగిలిన 4 సెంట్లను నమోదు చేయాలని కోరుతూ పది నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. పొరుగు రైతులు కూడా అంగీకరించినప్పటికీ అధికారులు సాకులు చెబుతూ తనను తిప్పుకుంటున్నారని, ముసలి వయసులో తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. చిన్నపాటి మార్పుల కోసం కూడా రైతులను ఏళ్ల తరబడి వేచి చూసేలా చేయడం దారుణమని ఆమె పేర్కొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన రత్న తన డి-పట్టా భూమిపై లోన్ రెన్యువల్ సమస్యను తీసుకొచ్చారు. 2003లో ప్రభుత్వం మంజూరు చేసిన 2.45 ఎకరాల భూమిని తాము నిబంధనలకు అనుగుణంగా సాగు చేసుకుంటున్నామని, అయితే బ్యాంకు లోన్ రెన్యువల్ కోసం రెవెన్యూ అధికారులు క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదా అడంగల్ ఇవ్వడం లేదని తెలిపారు. తాము ఏ తప్పు చేయలేదని, కేవలం పాత రికార్డులను పరిశీలించి పత్రాలు ఇస్తే తమకు ఆర్థికంగా ఊరట కలుగుతుందని ఆమె వివరించారు. పేద రైతులకు అందాల్సిన రుణ సదుపాయం రెవెన్యూ పత్రాల జాప్యం వల్ల ఆగిపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి కేవలం భూ సమస్యలే కాకుండా సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణ సమస్యలపై కూడా వందలాది మంది అర్జీలు అందజేశారు. నిరుద్యోగ యువత తమ ఉద్యోగ అవకాశాల కోసం రెస్యూమ్ లు సమర్పించగా, అనారోగ్యంతో బాధపడుతున్న కొందరు ఆర్థిక సహాయం కోసం విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, గత ఐదేళ్ల అరాచక పాలన వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి అర్జీని కంప్యూటరీకరించి, వాటి పరిష్కారానికి డెడ్ లైన్ విధిస్తామని నేతలు హామీ ఇవ్వడంతో బాధితులు నమ్మకంతో తిరిగి వెళ్లారు.

Spotlight

Read More →