తేదీ 10-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 10 జనవరి 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ వాసంసెట్టి సుభాష్ గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ వెంకట శివుడు యాదవ్ గారు (ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్)
తేదీ 08-01-2026 గురువారం నాడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవనీయ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను నాయకులకు వివరించారు. నాయకులు వాటిని శ్రద్ధగా విని, పరిష్కారాల కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రజా వేదిక కార్యక్రమం పార్టీ–ప్రజల మధ్య సంబంధాలను మరింత బలపరిచిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.