Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

Vande Bharat:తిరుపతి భక్తులకు గుడ్ న్యూస్.. విజయవాడ–బెంగళూరు వందే భారత్ పట్టాలెక్కనుంది!

తిరుపతి, బెంగళూరు దిశగా ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్తను అందించింది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు వస్తున్న భారీ స్పందనను దృష్టిలో పెట్టుకుని, వ

Published : 2025-11-23 11:28:00
MovieRulz: పైరసీ ఆపాలా? లేక చూడాలా.. ప్రేక్షకులే నిర్ణయించాలి.. MovieRulz ఇష్యూ!

తిరుపతి, బెంగళూరు దిశగా ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్తను అందించింది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు వస్తున్న భారీ స్పందనను దృష్టిలో పెట్టుకుని, విజయవాడ–బెంగళూరు మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు తిరుపతి మీదుగా బెంగళూరుకు వెళ్లేలా రూట్‌ను ఖరారు చేశారు. కొంతకాలంగా అనుమతులు, కోచ్‌ల సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ రైలు ఇప్పుడు పట్టాలెక్కేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 10న అధికారికంగా రన్‌లోకి రానున్న ఈ వందే భారత్‌పై ఇప్పటికే ప్రయాణీకుల్లో ఆసక్తి పెద్దఎత్తున కనిపిస్తోంది.

74వ రోజు ప్రజాదర్బార్... ప్రతి ఒక్కరి వినతులు స్వయంగా స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్!

ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బెంగళూరుకు కూడా హైస్పీడ్ రైలు కోసం వచ్చిన డిమాండ్‌ పెరగడంతో, విజయవాడ–బెంగళూరు మార్గంలో వందే భారత్ నడపడానికి రైల్వే అధికారులు మే నెలలోనే సూత్రప్రాయంగా ఆమోదం తెలపారు. అయితే కోచ్‌లు కేటాయింపు, టెక్నికల్ ఏర్పాట్లు పూర్తికావడంలో ఆలస్యం కావడంతో రైలు ప్రారంభం వాయిదా పడింది. అన్ని ఏర్పాట్లు పూర్తికావడంతో ఇప్పుడు షెడ్యూల్, నెంబర్, స్టాపేజీలను ఖరారు చేసి, అధికారిక ప్రకటన దశకు వెళ్లింది.

తిరుమలలో పెరిగిన రద్దీ... ఉచిత దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లు ఫుల్!

ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి ఉదయం త్వరగానే బయలుదేరి, సాయంత్రానికి బెంగళూరుకు చేరుకునేలా టైమ్ టేబుల్ రూపొందించారు. 20711 నెంబర్‌తో వెళ్లే రైలు విజయవాడ జంక్షన్ నుంచి ఉదయం 5.15కు స్టార్ట్ అవుతుంది. తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43 వద్ద ఆగుతుంది. తర్వాత ఉదయం 9.45కి తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుంచి చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38 గం.లకు చేరుకుని, చివరగా మధ్యాహ్నం 2.15 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు టెర్మినల్ స్టేషన్‌లో రైలు నిలుస్తుంది. ఇలా విజయవాడ నుంచి బెంగళూరువరకు ప్రయాణాన్ని సుమారు తొమ్మిది గంటలలో పూర్తి చేసుకునే వీలుంటుంది.

G20 Summit: జీ–20లో మోదీ దౌత్య పరాక్రమం.. యూఎన్ చీఫ్‌, బ్రిటన్ ప్రధానితో వరుస కీలక భేటీలు!!

తిరుగు ప్రయాణంలో అదే రోజు 20712 నెంబర్‌తో బెంగళూరులోని ఎస్‌ఎంవీటీ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు రైలు బయలుదేరుతుంది. వెంటనే కృష్ణరాజపురం 2.58, కాట్పాడి 5.23, చిత్తూరు 5.49, తిరుపతి 6.55 వద్ద ఆగుతుంది. రాత్రి 8.18కు నెల్లూరు, 9.29కు ఒంగోలు, 10.42కు తెనాలిని దాటి, చివరగా రాత్రి 11.45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. దీనివల్ల తిరుపతి వెళ్లే భక్తులకు, బెంగళూరు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు సమయానుసారం వెళ్లి రావడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు.

Good News: కుప్పంకు మరో కంపెనీ! గుడ్ న్యూస్ చెప్పిన నారా భువనేశ్వరి!

ఈ వందే భారత్‌లో మొత్తం 8 బోగీలు ఉండగా, అందులో 7 సాధారణ ఏసీ చెయిర్‌కార్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ చెయిర్‌కార్ కోచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వారంలో ఆరు రోజులపాటు ఈ రైలు నడుస్తుంది. మంగళవారం మాత్రం రేకుల పనులు, మెయింటెనెన్స్ కోసం సర్వీసులు నిలిపివేస్తారు. ఇతర రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయం దాదాపు మూడు గంటల వరకు తగ్గడం, పూర్తిగా ఏసీ సౌకర్యం, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన సీట్లు ఉండడం వంటి అంశాల కారణంగా ప్రయాణీకుల నుంచి మంచి స్పందన రావాల్సిందేనని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Highway Expansion: ఏపీలోనే ఆ నాలుగు హైవేలకు కీలక ప్రతిపాదనలు! రూ.9,490 కోట్లతో... ఆ ప్రాంతాల ప్రజలకు పండగే పండగ!

తిరుమల యాత్రికులు తిరుపతికి త్వరగా చేరుకోవడానికి, ఐటీ, ఉద్యోగ అవసరాలతో బెంగళూరుకు వెళ్లే వారికీ ఈ వందే భారత్ పెద్ద సౌలభ్యంగా మారనుంది. సమయపాలన, వేగం, కంఫర్ట్‌ను కలిపిన ఈ సేవ ప్రారంభమైతే, తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా, వేగవంతంగా మారబోతోందని రైల్వే ప్రయాణీకులు భావిస్తున్నారు.

MGNREGA: వారికి బిగ్ అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు! త్వరపడండి..
Gold Rates: మార్కెట్ లో దూసుకెళ్తున్న బంగారం ధరలు! ఈరోజు రెట్లు ఇలా....
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!
Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం!
BC Reservation: రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! గెజిట్ విడుదలకు సిద్ధం!
ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ! భారీ పెట్టుబడుల దిశగా ప్రముఖ కంపెనీల దృష్టి!
అరటి, పత్తి, మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు భరోసా.. ధరల పతనంపై అధికారులకు కీలక ఆదేశాలు!

Spotlight

Read More →