Canada Tourist: అరే.. ఇదేం స్లీపర్ క్లాస్? కెనడా టూరిస్టులకు భారతీయ రైల్లో వింత అనుభవం! Adventure Travel: సరిహద్దు గ్రామం నుంచి టాప్ టూరిస్ట్ స్పాట్‌గా…! తుర్టుక్ ప్రత్యేకత ఇదే! Toll Reduction: వాహనదారులకు గుడ్ న్యూస్..! టోల్ ఛార్జీలపై కేంద్రం భారీ ఊరట..! Passport: భారత పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు..! 56 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ! పోలీసుల 'స్పెషల్ డ్రైవ్'... చలాన్ల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇకపై కఠిన చర్యలు తప్పవు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఫిబ్రవరి 15 నుండి మారనున్న టికెట్ బుకింగ్ నిబంధనలు! Railway Updates: RAC రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫుల్ టికెట్.. సగం బెర్తు.. ఇకపై డబ్బులు వాపస్? రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! Canada Tourist: అరే.. ఇదేం స్లీపర్ క్లాస్? కెనడా టూరిస్టులకు భారతీయ రైల్లో వింత అనుభవం! Adventure Travel: సరిహద్దు గ్రామం నుంచి టాప్ టూరిస్ట్ స్పాట్‌గా…! తుర్టుక్ ప్రత్యేకత ఇదే! Toll Reduction: వాహనదారులకు గుడ్ న్యూస్..! టోల్ ఛార్జీలపై కేంద్రం భారీ ఊరట..! Passport: భారత పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు..! 56 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ! పోలీసుల 'స్పెషల్ డ్రైవ్'... చలాన్ల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇకపై కఠిన చర్యలు తప్పవు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఫిబ్రవరి 15 నుండి మారనున్న టికెట్ బుకింగ్ నిబంధనలు! Railway Updates: RAC రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫుల్ టికెట్.. సగం బెర్తు.. ఇకపై డబ్బులు వాపస్? రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు!

NationalHighways: జాతీయ రహదారులపై కేంద్రం గుడ్ న్యూస్.. 7 రోజుల్లో రూ.1.5 లక్షలు!!

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం  ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగితే చికిత్స కోసం ఆర్థిక సహాయం కోసం ఇబ్బంది పడే వారికి క

Published : 2025-12-22 09:53:00
Pensioners: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి.. జనవరి ఫిబ్రవరి లోగా!

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం  ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగితే చికిత్స కోసం ఆర్థిక సహాయం కోసం ఇబ్బంది పడే వారికి కేంద్రం భరోసానిచ్చారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి తక్షణమే వైద్య సహాయం అందాలి, ఆర్థిక పరిస్థితి అతని ప్రాణాలకు అడ్డంకి కావద్దు అనే ఉద్దేశంతో నగదు అవసరం లేని వైద్య చికిత్స విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు పెద్ద  ఊరట అని చెప్పుకోవచ్చు.

Deputy CM Bhatti: RTCలో ఉచిత ప్రయాణానికి మహిళలకు స్పెషల్ కార్డులు.. డిప్యూటీ సీఎం భట్టి!

కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ కొత్త విధానం ప్రకారం, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ప్రతి వ్యక్తికి ఆసుపత్రిలో చేరిన మొదటి ఏడు రోజుల వరకు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ వైద్య చికిత్స లభించనుంది. అంటే ఆసుపత్రిలో చేరిన వెంటనే అడ్వాన్స్ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో చికిత్స ఖర్చుల భయం, డబ్బుల లేమి కారణంగా గాయపడిన వారికి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణనష్టం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చడానికే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రైల్వే ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ ధరలు! మీ జేబుపై ఎంత భారం పడనుందంటే? ఎప్పటి నుంచి అమలు అంటే.!

ఈ పథకాన్ని రూపొందించి అమలు చేసే బాధ్యతను Ministry of Road Transport and Highways తీసుకుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయగా, ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలు వచ్చినట్లు సమాచారం. అదే అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, ఇప్పుడు అన్ని జాతీయ రహదారులపై ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ–ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి ఒక సమగ్ర వ్యవస్థను రూపొందిస్తున్నారు.

AP Government: రైతులకు అలర్ట్.. ఏపీలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు కొత్త మార్గదర్శకాలు! ఇక నుండి ఇలా...

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తొలి కొన్ని గంటలను వైద్యులు ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. ఈ సమయంలో బాధితుడికి సరైన చికిత్స అందితే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రమాద స్థలానికి అంబులెన్స్ చేరుకునే విషయంలోనూ కేంద్రం కీలక మార్పులు తీసుకురానుంది. ప్రమాద సమాచారం అందిన 10 నిమిషాల లోపు అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకోవాలనే లక్ష్యంతో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ సమయాన్ని ‘క్విక్ రియాక్షన్ టైమ్’గా పరిగణిస్తారు. నిర్ణీత సమయంలో అంబులెన్స్ చేరితే, దానికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. 

Praja Vedika: నేడు (22/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం రోడ్డు ప్రమాద బాధితులు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడా పెద్ద సహాయమని చెప్పుకోవాలి . అత్యవసర సమయంలో అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం వంటి పరిస్థితులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తీసుకున్న ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే అనవసర మరణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Ragi Malt: రాగిజావ తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
WhatsApp Governance: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్నీ వాట్సాప్‌లోనే! ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు...
Tirumala Darshan: మార్చి నెల దర్శనాలకు నేటి నుంచే టికెట్లు…! టీటీడీ ఫుల్ షెడ్యూల్ ఇదే!
Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక బాధ్యతలు అప్పగింపు!
Traffic Challans: మీ వాహనంపై చలాన్ ఉందా..? వాట్సాప్‌లోనే చెక్ చేయండి!

Spotlight

Read More →