Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్!

AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్

Published : 2025-12-18 18:27:00
Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో విజయవాడ బెర్మ్ పార్క్‌తో పాటు బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకులను ఆకర్షించేలా ఆల్ట్రా లగ్జరీ బోటు సేవలను ప్రారంభించేందుకు కీలక అడుగు వేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రైవేట్ బోటు ఆపరేటర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది.

Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!

ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ బెర్మ్ పార్క్, సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో మొత్తం ఐదు జెట్టీలను నిర్మించనున్నారు. బోట్లకు అవసరమైన విద్యుత్ సదుపాయాలు, మౌలిక వసతులను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందించనుంది. ఐదు ఆల్ట్రా లగ్జరీ బోట్లకు సంబంధించిన డిజైన్ డ్రాయింగ్‌లకు ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ నుంచి ప్రైవేట్ ఆపరేటర్లు అనుమతులు పొందిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ విలాసవంతమైన బోటు సేవలను 2026 అక్టోబర్ నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కేరళ తరహాలో నదులు, సముద్ర బ్యాక్ వాటర్‌లలో లగ్జరీ బోటు టూరిజాన్ని ఏపీలో అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.

టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.!

ఇప్పటికే ఈ బోటు సేవల నిర్వహణపై ఆసక్తి ఉన్న సంస్థలను ప్రభుత్వం ఆహ్వానించింది. కేరళలో ఇలాంటి లగ్జరీ బోటు సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో సంస్థతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చింది. వీరు విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి పవిత్ర సంగమం వరకు రెండు లగ్జరీ బోట్లను నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ మార్గంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర సర్వేను కూడా పూర్తి చేశారు. ఒక బోటులో ఐదు బెడ్రూంలతో పాటు 100 మంది పాల్గొనేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయనున్నారు. మరో బోటును 200 మంది డిన్నర్ చేసే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో భవానీ ద్వీపం వద్ద బోట్లను నిలిపేలా ప్రత్యేక జెట్టీతో పాటు విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

Health tips: మూత్రం రంగును బట్టి మీ బాడీ హైడ్రేషన్ లెవల్స్ తెలుసుకోండి.!!

ఇక బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్‌లో మరో మూడు లగ్జరీ బోట్లను ప్రైవేట్ సంస్థలు నడపనున్నాయి. నాగరాజు కెనాల్ నుంచి నిజాంపట్నం వరకు ఈ బోట్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇందులో ఒక బోటులో తొమ్మిది బెడ్రూంలు, మరో బోటులో మూడు బెడ్రూంలు, ఇంకొక బోటులో రెండు పడక గదులు ఏర్పాటు చేయనున్నారు. సూర్యలంక బ్యాక్ వాటర్‌లో సుమారు 30 కిలోమీటర్ల మేర పర్యాటకులు బోటు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మార్గమధ్యంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ప్రత్యేక ప్రాంతాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇదే తరహాలో రాజమహేంద్రవరం–కాకినాడ గోదావరి నది పరిధి, నాగార్జునసాగర్, విశాఖ తీర ప్రాంతాల్లోనూ ఆల్ట్రా డీలక్స్ బోటు సేవలను ప్రారంభించేందుకు ఏపీ టూరిజం అభివృద్ధి సంస్థ ఫీజిబిలిటీ సర్వే నిర్వహిస్తోంది. సర్వే పూర్తయ్యాక ఆసక్తి చూపే సంస్థలను ఆహ్వానించనున్నారు.
 

Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు!
బీఎస్ఎన్ఎల్ సంచలనం.. నెలకు కేవలం రూ. 200 ఖర్చుతోనే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు పొందండి.!
Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్!
UK Education: యూకేలో ఉన్నత విద్యకు శుభవార్త… భారతీయ విద్యార్థుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ గ్రేట్ స్కాలర్‌షిప్స్!!
AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…!
Tollywood Update: గొప్ప మనసు చాటుకున్న హీరో.. ఏపీలో ఆ కాలేజీకి రూ.2కోట్లు విరాళం!

Spotlight

Read More →