Train Accident: ఏపీలో ఘోర రైలు ప్రమాదం! రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం!

2025-12-29 07:56:00
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో చరిత్ర.. స్మృతి మంధాన రికార్డు!

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న 18189 నంబర్ టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో యలమంచలి సమీపంలో ఈ ఘటన జరిగింది.

Flipkart Year End Sale 2025: మావా.. ఈ డీల్ చూశావా? Galaxy A55 5Gపై కలలో కూడా ఊహించని ఆఫర్!

ప్యాంట్రీ కారుకు సమీపంలో ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో తొలుత దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగి క్షణాల్లోనే రెండు బోగీలకు వ్యాపించాయి. మంటలు చాలా వేగంగా విస్తరించడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరో సంచలన ప్రకటన! 90వేల మంది అభిమానుల సాక్షిగా..

మంటలను గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. రైలును యలమంచలి స్టేషన్‌లో నిలిపివేసి, రైల్వే అధికారులకు మరియు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే రెండు ఏసీ బోగీలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు పెద్దపీట - ఈవో కీలక ఆదేశాలు! టోకెన్లు ఉన్న వారికే..

సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. బోగీల్లో పొగలు నిండిపోవడంతో ప్రయాణీకులు ప్లాట్‌ఫారమ్‌లపైకి పరుగులు తీశారు. కొంతసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రాథమికంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే?

ఈ ప్రమాదానికి కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సడన్ బ్రేకులు వేయడం వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి వేరు చేసి సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

AP Pensions: ఏపీలో పెన్షన్ దారులకు బిగ్ అలెర్ట్! వారందరికీ పెన్షన్లు రద్దు.. !
Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
AP Railway Projects: హిందూపురం ప్రజలకు అదిరిపోయే గిఫ్ట్.. ఏపీలో మరో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చనున్న కేంద్రం!
Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు!
Women Controversy: శివాజీ వివాదంలో కేఏ పాల్ ఎంట్రీ..!

Spotlight

Read More →