కార్యకర్తలు దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై YCP గూండాలు దాడి చేసి నేటికి 4 సంవత్సరాలు ఆ చీకటి రోజున జరిగిన విధ్వంసం అంతా చూసిన తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ కృష్ణ మాటల్లో..
4 సంవత్సరాల తరువాత ఆ సంఘటనను మళ్ళీ గుర్తుచేసుకుంటూ..
-by బండారు వంశీకృష్ణ
తెలుగు యువత అధికార ప్రతినిధి
నేను నాటి దుర్ఘటనకు ప్రత్యక్ష సాక్షి
19 అక్టోబర్ 2021
ఉదయం 9:30 నిమిషాలు..
నాకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం గారు ఫోన్ చేసి
"విశాఖపట్నం నుండి గాంజా విచ్చలవిడిగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకే కాక పక్క రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతుందని మాట్లాడారని నక్కా ఆనంద్ బాబు గారికి విశాఖపట్నం పోలీసులు నిన్న అర్ధరాత్రి నోటీసులు ఇచ్చారు.. ఆ విషయం పై పత్రికా సమావేశం 10 గంటలకు కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేశానని చెప్పారు." ఓకే అన్నా... నేను ఆ టైమ్ కు ఆఫీస్ కు వస్తానని అన్నతో చెప్పాను.
ఉదయం 10 గంటలు..
కొమ్మారెడ్డి పట్టాభిరాం గారి పత్రికా సమావేశం ప్రారంభం అయ్యింది. Main Stream Media లో లైవ్ వెళ్తుంది.పత్రికా సమావేశం లో భాగంగా పట్టాభి గారు మాట్లాడిన మాటలు..
మధ్యాహ్నం 4 గంటలకు నక్కా ఆనంద్ బాబు గారు గాంజా గురించి మాట్లాడితే రాత్రి 11 గంటలకల్లా నోటీసులు తీసుకువచ్చిన పోలీసుల తీరు తప్పుబట్టారు.
(అప్పటి)సకలశాఖల మంత్రి సజ్జల ఆదేశాల ప్రకారం కేవలం 7 గంటలలో వచ్చి నోటీసులు ఇచ్చిన మీరు ఇదే దృష్టి గాంజా స్మగ్లర్ల మీద పెడితే ఈరోజు రాష్ట్రం పరువు పోయి ఉండేది కాదు కదా అని అన్నారు. "నక్కా ఆనంద్ బాబు గారు అన్న మాటే పక్కా రాష్ట్ర డీజీపీ లు అంటున్నారు జిల్లా ఎస్పీ లు అంటున్నారు. వాళ్ళకి పంపరా బోసెడికే నీ నోటీసులు అని రాష్ట్ర యువతను గాంజా మత్తులో నాశనం చేస్తున్నారన్న ఆక్రోశంతో సజ్జల రామకృష్ణా రెడ్డినీ ఉద్దేశించి అన్నారు పట్టాభి…
పట్టాభి గారితో అప్పటికే రెండు సంవత్సరాల నా పరిచయంలో అంత ఆవేశంగా పట్టాభిగారు మాట్లాడడం అదే తొలిసారి.
నేను ఒకింత ఆశ్చర్యంగా చూసాను పట్టాభి గారి వైపు. ఆయన కూడా అది గమనించారు.
ఉదయం 10:30 నిమిషాలు..
ప్రెస్మీట్ అయిపోయాక పట్టాభి అన్న నాకు మధ్య సంభాషణ
"ఏంటి వంశీ అలా చూశావ్"
“మీరు చాలా ఆవేశంగా మాట్లాడారు అన్న ఈరోజు”
"మరి రాష్ట్రాన్ని గాంజా హబ్ గా మార్చేసి చదువుకునే పిల్లల భవిష్యత్తు కూడా నాశనం చేసి ప్రశ్నించిన మన నక్కా ఆనంద్ బాబు గారికి నోటీసులు ఇస్తుంటే అలా ఆవేశం వచ్చేసింది" అన్నారు పట్టాభి అన్న.
ఉదయం 10:35 నిమిషాలు..
ఇద్దరం రెండవ అంతస్తు కు వెళ్ళాము
పట్టాభి గారు వేరే టాపిక్ పై నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నేను వివిధ టీవీ చానల్స్ లో వస్తున్న వార్తలు చూస్తునాను.
మధ్యాహ్నం 12 గంటలు..
సాక్షి టీవీ స్క్రోలింగ్
“ముఖ్యమంత్రిని ఉద్దేశించి బోసెడికే అనే అసభ్య పాదాజాలం వాడిన పట్టాభి”
మధ్యాహ్నం 12:30 నిమిషాలు…
పట్టాభి గారికి సాక్షి స్క్రోలింగ్ గురించి చెప్పాను. దానికి ఆయన "నేను ముఖ్యమంత్రిని ఏమి అనలేదు. అర్హత లేకపోయినా ప్రతి శాఖ లో దూరి ఇలాంటి పనులు చేస్తున్న సజ్జలను ఉద్దేశించి అన్నాను" అని చెప్పారు.
మధ్యాహ్నం 2 గంటలు..
ఆఫీసు లో భోజనం అయిపోయాక నేను ఆఫీసు కి పక్కనే ఉన్న మా ఇంటికి వెళ్ళిపోయాను. పట్టాభి అన్న ఆఫీస్ లో నే ఉన్నారు.
మధ్యాహ్నం 4:45 నిమిషాలు..
పాటిబండ్ల అనిల్ అన్న నాకు ఫోన్ చేశారు. మా సంభాషణ
“వంశీ ఎక్కడ ఉన్నావ్”
"ఇంట్లో ఉన్నాను అన్నా"
“అర్జెంట్ గా నీ కార్ తీసుకుని ఆఫీసు కు రా. పట్టాభి గారి ఇంటి మీద YCP గుండాల ఎటాక్ జరిగింది. పట్టాభి గారి ఇంటికి వెళ్ళాలి. ఆయన కార్ లో వెళ్ళడం అంత సేఫ్ కాదు.”
"ఓకే అన్నా. వస్తునాను"
సాయంత్రం 5:00 గంటలు..
నేను నా ఇంటి నుండి ఆఫీసు కు వెళ్ళాను. అనిల్ అన్న కు ఫోన్ చేసి "అన్నా నేను వచ్చాను. ఆఫీస్ బయట ఉన్నాను. రండి వెళ్దాం" అన్నాను.
వద్దు. కార్ ఆఫీస్ లోపలకి తీసుకువచ్చి పార్క్ చేయి. నువ్వు కూడా ఆఫీసు లోకి రా. కొంతమంది గూండాలు ఆఫీసు మీదకు గొడవ చేయడానికి వస్తున్నారని సమాచారం ఉంది" అన్నారు.
అప్పటికే పార్టీ ఆహ్వాన కమిటీ సభ్యులు కుమారస్వామి గారు మంగళగిరి రూరల్ పోలీసులకు, DGP కార్యాలయానికి ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు.కానీ వారి నుండి స్పందన లేదు.
సాయంత్రం 5:10 నిమిషాలు…
కార్ ను ఆఫీసు మెయిన్ ఎంట్రన్స్ ముందు పార్క్ చేసి బయటికి వచ్చాను.
సాయంత్రం 5:15 నిమిషాలు..
షుమారు 10 కి పైగా కారుల్లో కార్యాలయం మెయిన్ గేట్ ను ధ్వంసం చేసి లోపలకి వచ్చేశారు.
అక్కడ నేను, ఇంతియాజ్, పార్టీ ఆఫీసు అటెండర్ వందనం మాత్రమే ఉన్నాము.
కార్యాలయం ముందు నిరసన తెలియచేస్తారు ఆనుకున్నాను కానీ ధ్వంసం చేయడమే వారి లక్ష్యం అని నేను ఊహించలేదు.
వారు రావడం రావడంతో పార్టీ సీనియర్ నాయకుడు దొర బాబు పై దాడి చేయడం తో ఆయన చేయి ఫ్రాక్చర్ అయ్యింది. వారూ గాంజా మత్తులో ఉన్నారని అర్థమయ్యింది. వారి చేతుల్లో ఇనుప రోడ్లు , బీరు సీసాలు మారణాయుధాలు చూసి మేము ముగ్గురం వెనకడుగు వేశాం.
అక్కడ పార్క్ చేసి ఉన్న ప్రస్తుత ప్రత్తిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు గారి ఫార్చ్యూనర్ కార్, నా వోక్స్వాగన్ పోలో కార్, పట్టాభి గారి టయోటా ఇన్నోవా, పార్టీ NRI విభాగం చప్పిడి రాజశేఖర్ గారి ఫోర్డ్ ఎకో స్పోర్ట్, MLC అశోక్ బాబు గారి కియా సెలెటోస్, పార్టీ ఆహ్వాన కమిటీ సభ్యులు కుమార స్వామి గారి టయోటా ఇన్నోవా కార్లను ఇనుప రాడ్లతో రాళ్ళతో ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయంలోకి ఎంటర్ అయి అక్కడ ఉన్న ఉద్యోగి బద్రీనాథ్ తల పగలగొట్టారు. అడ్డుపడిన పాటిబండ్ల అనిల్ మరియు విద్యాసాగర్ ను కూడా గాయపరిచారు.
సాయంత్రం 5:30 నిమిషాలు…
దాదాపుగా 15 నిమిషాల విధ్వంసం సృష్టించి మనుషులపై హత్యాప్రయత్నం చేసి కార్యాలయాన్నీ కార్లను ధ్వంసం చేసి వెళ్ళిపోయారు ముష్కరులు. ఈ విధ్వంసం మొత్తం జగన్ రెడ్డి కి చూపించడానికి వారితో పాటు వీడియోగ్రాఫర్ ను కూడా తెచ్చుకున్నారూ ఆరోజున.
సాయంత్రం 5:40 నిమిషాలు…
గాయపడ్డ బద్రీనాధ్, అనిల్, విద్యాసాగర్ లను మణిపాల్ హాస్పిటల్ కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గారి కార్లో పంపించాము. ఆ గూండాలను పోలీసులు దగ్గరుండి సాగనంపడం చూసి బాధేసింది.

సాయంత్రం 5:50 నిమిషాలు…
నేను కేంద్ర కార్యాలయంలో పని చేసే మా సిబ్బంది మరియు అప్పటికే అందుబాటులోకి వచ్చిన మంగళగిరి నియోజకవర్గ నాయకులతో కలిసి NH5 నేషనల్ హైవే ముట్టడించాను.
సాయంత్రం 6:25 నిమిషాలు…
అరగంటకు పైగా మీరు హైవే ముట్టడించారు. సామాన్యులు ఇబ్బంది.పడుతున్నారు. ఇటు టోల్ గేట్ వరకు, అటు వారధి వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. దయచేసి విరమించండి అని విజ్ఞప్తి చేశారు.
మా కార్యకర్తలు అప్పటికే వేల సంఖ్యలో వచ్చేశారు. సార్ ఇది నా చేతుల్లో లేదు. DGP. ఆఫీసు కు మా ఆఫీసు 5 నిమిషాల నడక దూరం. అలాంటిది ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై.పోలీసులు దగ్గరుండి దాడి చేయించడం దారుణం అంటూ ఆయనతో చెప్పాను.
రాత్రి 7 గంటలు…
చంద్రబాబు నాయుడు గారి పార్టీ కార్యాలయానికి ఉండవల్లి నివాసం నుండి బయలుదేరారు. పార్టీ సీనియర్ నాయకులు అప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి.
రాత్రి 7:30 నిముషాలు..
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య గారు, అశోక్ బాబు గారు, అప్పటి ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ ఇప్పటి గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారు, నాలెడ్జ్ కమిటీ చైర్మన్ గురజాల మాల్యాద్రి గారు, దారపనేని నరేంద్ర బాబు గారు తదితరులు ఘటన జరిగినపుడు కార్యాలయంలో ఉన్నారు. చంద్రబాబు గారికి జరిగింది వివరించారు.
రాత్రి 8:30 నిమిషాలు…
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు హైదరాబాద్ నుండి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.విధ్వంసం జరిగిన తీరు ఆయనకు వివరించాను.
రాత్రి 8:45 నిమిషాలు..
ధ్వంసం అయిన పట్టాభి గారి ఇంటిని పరిశీలించేందుకు చంద్రబాబు గారు ప్రయాణం అవుతున్న సమయంలో ఒక అనుమానితుడు చంద్రబాబు గారిని వీడియో తీయడం గమనించాను. అతనిని పట్టుకుని అడగగా పార్టీ అభిమానినీ అని ఒకసారి, నిఘా విభాగం పోలీస్ అని ఒకసారి పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
అతనిని పట్టుకుని వర్ల రామయ్య గారి వద్దకు తీసుకెళ్ళాను. ఆయన మాజీ.పోలీస్ అధిసారి.కాబట్టి ఆయన స్టయిల్లో అడిగి విషయాన్ని రాబట్టారు. విధ్వంసం ప్రారంభం అయినప్పటినుండి అక్కడ ఏమి జరుగుతుందో మినిట్ టూ మినిట్ అప్డేట్ ఇస్తున్నట్లు ఆయన ఫోన్ చూసి అర్థం అయ్యింది. దీంతో ఆవేశంలో ఉన్న మా కార్యకర్తలు అతనిని ఏమి చేయకుండా కాపాడి అతనిని పట్టుకుని పోలీసులకు సరెండర్ చేశారు వర్ల రామయ్య గారు.
రాత్రి 9:00 గంటలు…
పట్టాభి గారి 7 ఏళ్ల కూతురు ముందే ఈ విధ్వంసం జరగడంతో బాగా భయపడిపోయిన పాపను పరామర్శించి ఇంటిని పరిశీలించారు చంద్రబాబు నాయుడు గారు .
రాత్రి 11 గంటలు..
న్యాయనిపుణలతో భేటీ అయ్యి దాదాపుగా 3 గంటల సేపు చర్చించుకున్నాక ఫిర్యాదు కాపీ తయారు చేసి అర్ధరాత్రి 2 గంటలకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము.
ఆ చీకటి రోజుకి నేటితో 4 సంవత్సరాలు…
YSR Congress పార్టీ సమాధికి ఎన్నో కారణాలు ఉంటే అందులో అతిముఖ్యమైన కారణం కొన్ని కోట్ల మందికి దేవాలయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి.
జై తెలుగుదేశం.