LIVE
IndiGo fligth: హై అలర్ట్.. లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు... టాయిలెట్ లో కలకలం రేపిన నోట్!  •  Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!  •  Praja Vedika: రేపు (13/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  అమెరికా మిస్సైల్ దాడిలో విశాఖ యువకుడి దుర్మరణం... చంద్రబాబు ఆరా!!  •  Jobs: దుబాయ్‌లో ఉద్యోగాలు... నెలకు రూ.1.12 లక్షల జీతం... గోల్డెన్ ఛాన్స్ మీకోసమే!  •  Amaravathi Works: అమరావతి నిర్వాసితులకు గుడ్ న్యూస్... ఏడాది పాటు నెలకు రూ.10 వేల అద్దె!  •  Horticulture: భారత్‌లో ఉద్యానవన పంటల ఉత్పత్తికి భారీ వృద్ధి! 3,778 లక్షల టన్నులకు చేరనున్న హార్టికల్చర్ ఉత్పత్తి!  •  Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ! కేవలం 30 రోజుల్లో..  •  AP Farmers: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... కీలక ఆదేశాలు... దాదాపు పదేళ్ల తర్వాత...!!  •  H1B Visa: వీసా బాదుడుకు యూఎస్ కోర్టు బ్రేక్... వెనక్కి తగ్గని ట్రంప్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!

Nara Lokesh: ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా మంత్రి నారా లోకేష్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. “కార్యకర్తే అధినేత” అనే భావనకు అనుగుణంగా పనిచేస్తున్నారని చెబుతూ, వైసీపీ హయాంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చారు.

AndhraPravasi News Desk 1 min read
Nara Lokesh
Nara Lokesh

కార్యకర్తే అధినేత అన్న మాటకు నిదర్శనం.. వీరాంజనేయులుకు ఉద్యోగ నియామకం..

వైసీపీ అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు.. హామీని నెరవేర్చిన లోకేష్..

అమరావతి: ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా మంత్రి నారా లోకేష్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. “కార్యకర్తే అధినేత” అనే భావనకు అనుగుణంగా పనిచేస్తున్నారని చెబుతూ, వైసీపీ హయాంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చారు.

వైసీపీకి చెందిన వ్యక్తుల చేతిలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ అపాయింట్‌మెంట్ లెటర్ అందజేశారు.

తోట చంద్రయ్య కుటుంబానికి అండగా నిలుస్తానని గతంలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియలో శాసనమండలిలో వైసీపీ నుంచి అభ్యంతరాలు ఎదురైనా, వెనక్కి తగ్గకుండా నిర్ణయాన్ని అమలు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్న తోట వీరాంజనేయులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.

కార్యకర్తల సంక్షేమానికి, బాధిత కుటుంబాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ ఘటన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పాలనకు నిదర్శనంగా నిలిచిందని వారు తెలిపారు.

Be the first to react

More Coverage

Nara Lokesh: ఆధారాలతో సహా జగన్ అబద్ధాలను నిరూపించాం.. డీఎస్సీ వివాదంపై మంత్రి లోకేశ్ సంచలన పోస్ట్!

Nara Lokesh: ఆధారాలతో సహా జగన్ అబద్ధాలను నిరూపించాం.. డీఎస్సీ వివాదంపై మంత్రి లోకేశ్ సంచలన పోస్ట్!

మాజీ ముఖ్యమంత్రి జగన్ డీఎస్సీ విషయంలో తప్పుడు ప్రచారం చేసి, అభ్యర్థులను తప్పుదోవ పట్టించారని, దీనికి…

AP Farmers: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... కీలక ఆదేశాలు... దాదాపు పదేళ్ల తర్వాత...!!

AP Farmers: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... కీలక ఆదేశాలు... దాదాపు పదేళ్ల తర్వాత...!!

AP Farmers: ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ తదితర ఆర్థిక సంస్థల మోసాలకు గురైన డిపాజిటర్లకు సత్వర న్యాయం…

Chandrababu: ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు!

Chandrababu: ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు!

Chandrababu: ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్ర…