AP Water Resources: సముద్రం పాలవుతున్న 5 వేల టీఎంసీలు.. ప్రతి నీటి చుక్కను ఒడిసిపడతాం సీఎం చంద్రబాబు..!! Cm CBN: ప్రతి ఎకరాకూ నీరు అందేలా సాగునీటి సంఘాలు పనిచేయాలి.. సీఎం చంద్రబాబు! Swarna ward employees: APలో స్వర్ణ వార్డు ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్! తిరుమల లడ్డూ కల్తీపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. నివేదికలను తొక్కిపెట్టి.. భక్తుల మనోభావాలతో.! CM Chandrababu: వెంకటేశ్వర స్వామి భక్తుడిగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నాదే... సీఎం చంద్రబాబు! ఏపీలో మహిళలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..! 50 వేల విలువైన సామాగ్రి ఉచితం! Kondaveeti Kota Utsavalu 2026: చారిత్రక వైభవానికి ఆధునిక హంగులు.. ఈనెల 7, 8 తేదీల్లో కొండవీటి కోట సంబరాలు! పాయకరావుపేటలో నియోజకవర్గంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు.. ఘనంగా నిర్వహించిన హోం మంత్రి! భూగర్భంలో ఇరాన్ 'క్షిపణి నగరం'! ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ మేఘాలు! మెట్రో సెకండ్ ఫేజ్ ధమాకా.. హైదరాబాద్ నలుమూలలా మెట్రో పరుగులు.. ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు! AP Water Resources: సముద్రం పాలవుతున్న 5 వేల టీఎంసీలు.. ప్రతి నీటి చుక్కను ఒడిసిపడతాం సీఎం చంద్రబాబు..!! Cm CBN: ప్రతి ఎకరాకూ నీరు అందేలా సాగునీటి సంఘాలు పనిచేయాలి.. సీఎం చంద్రబాబు! Swarna ward employees: APలో స్వర్ణ వార్డు ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్! తిరుమల లడ్డూ కల్తీపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. నివేదికలను తొక్కిపెట్టి.. భక్తుల మనోభావాలతో.! CM Chandrababu: వెంకటేశ్వర స్వామి భక్తుడిగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నాదే... సీఎం చంద్రబాబు! ఏపీలో మహిళలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..! 50 వేల విలువైన సామాగ్రి ఉచితం! Kondaveeti Kota Utsavalu 2026: చారిత్రక వైభవానికి ఆధునిక హంగులు.. ఈనెల 7, 8 తేదీల్లో కొండవీటి కోట సంబరాలు! పాయకరావుపేటలో నియోజకవర్గంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు.. ఘనంగా నిర్వహించిన హోం మంత్రి! భూగర్భంలో ఇరాన్ 'క్షిపణి నగరం'! ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ మేఘాలు! మెట్రో సెకండ్ ఫేజ్ ధమాకా.. హైదరాబాద్ నలుమూలలా మెట్రో పరుగులు.. ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు!

Tirumala Laddu case: వైసీపీ దుష్ప్రచారానికి చెక్.. కల్తీ లడ్డూ వాస్తవాలపై క్షేత్రస్థాయిలోకి కూటమి నేతలు!

తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ. వైసీపీ హయాంలో జరిగిన అపవిత్ర పనులను ఆధారాలతో ఎండగట్టాలని నిర్ణయం.

Published : 2026-02-05 12:17:00

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూటమి ప్రభుత్వం సమగ్ర పోరాటానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మరియు ప్రభుత్వంలోని కీలక మంత్రులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా సిట్ (SIT) నివేదిక మరియు ఎన్డీడీబీ (NDDB) ఇచ్చిన నివేదికల ఆధారంగా వైసీపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు.

నివేదికల్లో విస్తుపోయే నిజాలు

శ్రీవారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని గతంలోనే ల్యాబ్ నివేదికలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సిట్ దర్యాప్తులో తేలిన మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలను ఈ సమావేశంలో చర్చించారు. అసలు లడ్డూ తయారీలో వాడింది స్వచ్ఛమైన నెయ్యే కాదని, అది కేవలం రసాయనాలు మరియు జంతువుల కొవ్వుతో నిండిన ద్రవమని అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం భక్తుల మనోభావాలను ఇంత దారుణంగా దెబ్బతీసిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.

వైసీపీ దుష్ప్రచారానికి చెక్

ఈ వ్యవహారంలో తమకు క్లీన్ చిట్ లభించిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. నివేదికలు కల్తీని స్పష్టంగా చూపిస్తుంటే, అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని చూడటం దారుణమని మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భక్తుల పవిత్రతను కాపాడటంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, ఈ క్రమంలో జరిగిన అవినీతి మరియు అపవిత్ర పనుల పత్రాలను బహిరంగపరచాలని సమావేశం నిర్ణయించింది.

ఈ సమావేశంలో పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు ఇతర ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలిచ్చారు. దర్యాప్తు ఎక్కడా పక్కదారి పట్టకుండా, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను అడ్డం పెట్టుకుని జరిగిన అక్రమాలను వెలికితీయడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

Spotlight

Read More →