కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ తలపెట్టిన 'భారత్ జోడో న్యాయయాత్ర' మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్ నుండి రాహుల్ నేతృత్వంలో మొదలుపెట్టిన ఈ యాత్ర గురువారం అస్సాంకు చేరుకుంది. జోర్హాట్ పట్టణం చేరుకున్న సమయంలో.. కేటాయించిన మార్గంలో కాకుండా నిర్వాహకులు మరోవైపు వెళ్లారని అస్సాం పోలీసులు వెల్లడించారు.
ఈ మార్పు పట్టణంలో అంతరాయాలకు దారితీసిందని తెలిపారు. ట్రాఫిక్ బారికేడ్లను తొలగించేలా, పోలీసులపై దాడి చేసేలా ప్రజలను నేతలు రెచ్చగొట్టారని ఆ కేసులో పేర్కొన్నారు. రాహుల్తో పాటు యాత్ర నిర్వాహకులపై కూడా కేసు నమోదైంది. అయితే కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇదంతా యాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం అని విమర్శించారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
మాకు కేటాయించినది ఇరుకైన మార్గం మరియు రద్దీ ఎక్కువగా ఉండటం వలన కొద్దిదూరం వేరే మార్గం లో ప్రయాణించాం. మొదటిరోజు అస్సాంలో యాత్ర విజయంతం అవడంతో ఆందోళనలో ఉన్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. దానిని దారిమళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి