ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం!

2025-12-01 12:24:00
Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్!

ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం రాజకీయ పరిపాలనతో పాటు ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై ఉండేవిధంగా పనిచేయడం కావాలని ఆయన చెప్పారు. డిసెంబర్ నెల పార్టీ కార్యక్రమాల క్యాలెండర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.

Promotions & Social మెయిళ్లతో స్టోరేజ్ నిండిపోతోందా? ఒక్క క్లిక్‌తో క్లియర్!

పెన్షన్ పంపిణీపై చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన ఎలాంటి అంతరాయం లేకుండా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. రూ.4,000 నుంచి రూ.15,000 వరకు కేటగిరీలవారీగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వృద్ధులకు ఏటా రూ.48,000, డయాలసిస్ రోగులకు రూ.1.2 లక్షలు, మంచానికే పరిమితమైన వారికి రూ.1.8 లక్షలు అందుతున్నాయని వివరించారు. ఇప్పటివరకు ఈ పథకానికి మాత్రమే రూ.50,763 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.

Dithva Cyclone: ఏపీలో దిత్వా ఎఫెక్ట్..! 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు!

చంద్రబాబు పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు గౌరవం తప్పక అందిస్తామని చెప్పారు. పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కుటుంబ సాధికార సారథులు, బూత్ కమిటీలు ప్రభుత్వ మంచి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు…

గత ప్రభుత్వ విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. పథకాల నిధులను నిలిపివేయడం, దారి మళ్లించడం వంటి విషయాలను ప్రజల్లో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ తప్పులను సరిచేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని, ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను పేదలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!!

డిసెంబర్‌లో జరిగే రైతు సేవా కేంద్రాల వర్క్‌షాప్‌లు, పేరెంట్-టీచర్ మీటింగ్‌లలో పార్టీ నేతలు పాల్గొని ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని ఆదేశించారు. కొన్నిచోట్ల అనర్హులు పెన్షన్లు పొందుతున్నా, అర్హులైన వారికి ఎలాంటి అన్యాయం జరగబోదని చెప్పారు. వచ్చే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..!
Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం...
Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!!
Train Tickets: తత్కాల్ టికెట్లకు కొత్త రూల్స్! ఇకపై ఆ వెరిఫికేషన్ తప్పనిసరి..!
Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →